రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. మూలవాగుపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన సెంట్రింగ్ కుప్పకూలింది. నిర్మాణ దశలోనే వంతెన కూలిపోవడంపై అధికారులు నిర్ణక్ష్యం పై విమర్శలు వస్తున్నాయి.