కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న ఐపీల్ మ్యాచ్ లను టీవీలలో, ఆన్లైన్ లో తెగ చూసేస్తున్నారట. ఐపీల్ ప్రారంభమైన మొదటి వారమే ఏకంగా 27కోట్ల మంది చూసినట్లు బార్క్-నీల్సన్ సర్వే తెలిపింది. చివరి సీజన్ తో పోల్చితే మ్యాచ్ లను చూస్తున్నవారి సంఖ్య 15% వరకు పెరిగినట్లు వెల్లడైంది. ఐపీల్ మ్యాచ్ లను పట్టణ ప్రాంతాలలో అత్యధికంగా చూస్తున్నారని తెలిపింది. ప్రకటనలు కూడా భారీగా పెరిగాయని 2020 ఐపీఎల్ వ్యూయర్షి్పలో సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్టు ఉందని సర్వే లు తెలుపుతున్నాయి.