ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడి, నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం కు వివరించారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేల దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.23 శాతం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3148 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 1095 మందికి శస్త్ర చికిత్స చేసినట్లు వెల్లడించారు.