అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘటనలో నలుగురు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే యథ్నంలో భాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలో ఓ మహిళ మరణించింది. మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.