అప్ఘనిస్తాన్ లోని కాబుల్ లో ఆదివారం కారుబాంబు పేలింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. కాబుల్ కు పశ్చిమ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అంతర్గత వ్యహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. రెండు రోజుల కిందట జరిగిన పేలుళ్లలో 15 మంది చిన్నారులు మరణించారు. కాబుల్ లో వరుస సంఘటనలతో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కాగా ఇది ఆత్మహుతి దాడిగానే స్థానిక అధికారులు పరిగణిస్తున్నారు.