spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జగన్ 'కుల' రాజ్యాన్ని ప్రశ్నించిన రాయపాటి

జగన్ ‘కుల’ రాజ్యాన్ని ప్రశ్నించిన రాయపాటి


గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాటలు తడుముకోకుండా, కపటం లేకుండా, నిష్కర్షగా మాట్లాడుతూ సంచలన రాజకీయ ప్రకటనలు చేస్తూ తరచూ వార్తలలో కనిపిస్తుంటారు. తాజాగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి `కుల’ రాజ్యాన్ని ప్రశ్నించడం ద్వారా పెను దుమారం రేపారు.

పైగా, `కమ్మ’ కులస్థుల పట్ల `వివక్షత’ చూపుతున్నారని అంటూ మండిపడ్డారు. ఆ కులం వారి పేరు కనబడితేనే పక్కన పెట్టివేస్తున్నారని అంటూ విరుచుకు పడ్డారు. ఆ విధంగా చేయడం రాజకీయంగా మంచిది కాదంటూ జగన్ కు హితవు చెప్పారు. వీరేమి చేస్తారులే అనుకొంటే రాజకీయంగా ఎదురు దెబ్బ తప్పదని అంటూ సున్నితంగా హెచ్చరించారు.

అదీ కాకుండా, ఈ ప్రభుత్వంలో కేవలం `రెడ్డి’ సామజిక వర్గం వారికే కీలక పదవులన్నీ లభిస్తున్నాయని అంటూ విరుచుకు పడ్డారు. బలహీన వర్గాలు, మహిళలకు సగం పదవులు ఇస్తామని చెప్పిన జగన్, తన సామజిక వర్గం వారినే అందలం ఎక్కిస్తున్నారని అంటూ చెప్పుకొచ్చారు.

రాయపాటి చేసిన విమర్శలు అన్ని జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. గత పది నెలల్లో ఈ ప్రభుత్వంలో సుమారు 500 మంది ఒకే సామజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెట్టారని అంటూ సోషల్ మీడియాలో పేర్లతో సహా ప్రచారం జరుగుతున్నది. అయితే ఒక సీనియర్ రాజకీయ నోటినుండి వెలువడడంతో రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నాయి.

ఒక సారి రాజ్యసభకు, ఐదు సార్లు లోక్ సభకు ఎన్నైనా, ఆయనకు సొంత పార్టీలోనే తీవ్రమైన ప్రత్యర్ధులు ఉంటూ వచ్చారు. అయితే సుదీర్ఘకాలం ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నా సాధారణ ప్రజలలో ఆయన పట్ల సానుభూతి, ఆదరణ భావాలే నెలకొంటూ ఉన్నాయి. దానితో ఆయన ప్రకటన సాధారణ జనంలో కలకలం రేపే అవకాశం ఉంది.

ముఖ్యంగా మాజీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పట్ల ఈ ప్రభుత్వం జరుపుతున్న దాడులపై రాయపాటి మండిపడ్డారు. గత నెలలో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేయని పక్షంలో రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి వేల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు.

అదే విధంగా మూడు రాజధానులపై జగన్ గుడ్డిగా ముందుకు వెడితే రాజకీయాలలో `జీరో’ కాగలరని రాయపాటి హెచ్చరించారు. కరోనా మహమ్మారి సద్దుమణిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలసి జగన్ దుశ్చర్యలపై ఫిర్యాదు చేయగలనని రాయపాటి తెలిపారు. జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో రాయపాటి సన్నిహితంగా ఉండడం గమనార్హం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper