Homeజాతీయ వార్తలుYellow Alert In Hyderabad: భాగ్యనగరంలో ఎల్లో ఎలెర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో చలి మరింత...

Yellow Alert In Hyderabad: భాగ్యనగరంలో ఎల్లో ఎలెర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో చలి మరింత పెరిగే ఛాన్స్..

Yellow Alert In Hyderabad: చలి పంజా రోజురోజుకూ పెరుగు తుంది. సాధారణంగా చలికాలం అన్నాక చలి తీవ్రత అంతటా ఉంటుంది. అయితే ఈసారి భాగ్యనగరం లో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఈసారి హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడి పోయాయి. గత మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీ మార్పు వచ్చింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడి పోవడంతో హైదరాబాద్ లో వాతావరణం కాశ్మీర్ వాతావరణం లాగా అనిపిస్తుంది.

Yellow Alert In Hyderabad
Yellow Alert In Hyderabad

గత పది సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ లో పాళీ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ శనివారం తెల్లవారు జామున పఠాన్ చెరు లో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇప్పటి వరకు ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడు హైదరాబాద్ లో నమోదు అవలేదు.

2015 డిసెంబర్ 13న 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవ్వగా ఇప్పటి వరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రతగా రికార్డ్ ఉంది. అయితే నిన్న హైదరాబాద్ లో నమోదు అయినా ఉష్ణోగ్రతతో ఈ రికార్డ్ మాయం అయ్యి కొత్త రికార్డ్ సెట్ అయ్యింది. మరొక నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చలికి తోడు గాలులకు కూడా వణికి పోతున్న భాగ్యనగరం వాసులు ఈ వార్త విని ఇంకా హడలి పోతున్నారు.

Also Read: సుందరమైన విశాఖ తీరం ఇలా ఎందుకు మారుతోంది..?

రానున్న నాలుగు రోజుల్లో మరొక 3 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు 6 నుండి 8 కిలో మీటర్ల వేగంతో చల్లని గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాబట్టి డిసెంబర్ 21 వరకు నగర వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలకు కూడా వచ్చే కొన్ని రోజుల వరకు ఆరెంజ్ వార్ణింగ్ ను జారీ చేసింది.

ఒకవైపు చలి పంజా విసురుతుంటే మరొక వైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ ప్రజల్లో మరొక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే తెలంగాణ లో కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయట. దీంతో తెలంగాణ లో మొత్తం 20 కేసులు అయ్యాయి. చలి ప్రభావం ఎక్కువ ఉండడం తో ఆరోగ్య పరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండ పాటించాలని వారు సూచిస్తున్నారు.

Also Read: వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరు.. నేతల మధ్య కానరాని సఖ్యత

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper