Homeజాతీయ వార్తలుభర్త చికెన్ తిన్నాడని ప్రాణాలు తీసుకున్న భార్య..

భర్త చికెన్ తిన్నాడని ప్రాణాలు తీసుకున్న భార్య..

Woman Committed Suicide క్షణికావేశం.. పట్టరాని కోపం.. ఫలితం మాత్రం శూన్యం. మాట వినలేదనే నెపంతో తన ఒళ్లు కాల్చుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. కట్టుకున్న వాడే తన మాటకు ఎదురు చెప్పడంతో భరించలేకపోయింది. పవిత్రమైన శ్రావణమాసంలో మహిళలు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా భార్య, భర్త బంధువుల ఇంటికి వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చాక తమ సమీప బంధువుల ఇంటిలో భర్తని వద్దని వారించినా వినకుండా చికెన్ తిన్నాడు. దీంతో భరించలేని భార్య తన మాట వినని భర్తపై కోపం పెంచుకుంది. పవిత్రమాసంలో తన మాట వినకుండా అపవిత్రమయ్యాడని భావించి తన ప్రాణాలు తీసుకోవాలని భావించింది. ఇంటిలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చివరికి ప్రాణాలు వదిలింది.

రాయ్ పూర్ లోని కరౌదా గ్రామానికి చెందిన మనీషా సింగ్ తన భర్త రామజన్మతో కలిసి నివాసం ఉంటోంది. శ్రావణమాసంలో నియమనిష్టలతో పూజలు చేస్తోంది. తమ ఇష్ట దైవాలను పూజిస్తోంది. చిన్న విషయాలను కూడా పెద్దగా చూసుకునే మహిళలు భర్త చెప్పిన మాట వినలేదని కోపం పెంచుకుంది. పండుగ పూట కావాలనే చికెన్ తినడంతో భార్య జీర్ణించుకోలేకపోయింది. తాను పూజలు చేస్తుంటే భర్త విచ్చలవిడిగా మాంసం తింటే ఎలా అని మథనపడింది. ఇక తన జన్మ వృథా అని భావించింది.

మాంసమంటే అందరికి ఇష్టమే. కనిపిస్తే చాలు తినేయాలని చూస్తారు. అదే ఆయన చేసిన తప్పు. భార్య వారిస్తున్నా వినకుండా నోరును అదుపులో పెట్టుకోలేక ఇష్టంగా మాంసం తిన్నాడు. అంతేసంగతి భార్య కళ్లలో ఉగ్ర రూపం చూశాడు. దైవత్వంతో తాను పూజలు చేస్తుంటే భర్త ప్రవర్తన ఇలా ఉండడంతో ఓర్వలేకపోయింది. తన జీవితం వృథా అని భావించి లోకంలో ఉండడం కుదరదనుకున్న ఆమె జీవితాన్నే చాలించింది.

భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో గమనించిన భర్త మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మంటలు ఆర్పి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయాలు ఎక్కువవడంతో చికిత్స పొందుతూ మనీషా సింగ్ మృతి చెందింది. దీంతో అందరు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నేపథ్యంలో మనీషా సింగ్ ప్రాణాలు తీసుకోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular