Kerala Floods 2024
Kerala Floods 2024: అరేబియా సముద్రంపై ఇంకా కొనసాగుతున్న వేడికాలల నేపథ్యంలో మరింత దట్టమైన మేఘాలు అలుముకుంటున్నాయి. రానున్న 2-3 రోజుల పాటు కేరళలోని లోతట్టు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 30 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందులో వయనాడ్ కూడా ఉంది. జూలై 30 నుంచి 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 24 గంటల్లో ఏడు నుంచి 11 సెంటీ మీటర్లు, 2వ రోజు 12 సెంటీ మీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అంటే, ఇది విపరీతమైన పరిస్థితి. వయనాడ్, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, కాసర్ గోడ్ లో దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. 2వ రోజు కూడా ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల మధ్య వయనాడ్ లో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు, ఇళ్లకు నష్టం, చెట్లు నేలకూలడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి హెచ్చరికలు జారీ చేశారు.
ఇంత వర్షం ఎందుకు పడుతోంది?
కేరళ సమీపంలో ధట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ఉపగ్రహ చిత్రం స్పష్టం చేస్తోంది. కేరళకు తూర్పున ఉన్న పశ్చిమ కనుమల ఎత్తయిన కొండల్లో ఈ మేఘాలు వ్యాపించి ఉన్నాయి. మేఘాలు ముందుకు కదిలేందుకు కొండలు దారి ఇవ్వలేదు. దీంతో 2013లో కేదార్ నాథ్ లో జరిగిన బీభత్సం వయోనాడ్ లో జరిగింది. అక్కడ కూడా మేఘాలు పర్వతాల్లో చిక్కుకున్నాయి.
అరేబియా సముద్రం ఉపరితలం వేగంగా వేడెక్కుతోంది. కాసర్ గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. సముద్రం ఉపరితలంపై ద్రోణి ఉంది. దీంతో రెండు రోజుల పాటు కొంకణ్ ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. సరిగ్గా 2019లో ఇదే వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం మెసోస్కేల్ క్లౌడ్ సిస్టమ్ ఉంది.
మేఘామృతం అయ్యేందుకు గల కారణాలు..
కేరళ సమీపంలోని అరేబియా సముద్రంపై ధట్టమైన మేఘాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అరేబియా సముద్రానికి దక్షిణ భాగం సముద్రంలో కనిపిస్తుంది. కొన్ని సార్లు అది భూమి వైపు కదులుతుంది. 2019లో జరిగినట్లే.. వాతావరణ మార్పుల కారణంగా అరేబియా సముద్రం వేడెక్కుతోంది.
దీని ప్రభావం కేరళపై పడుతుంది. కేరళ వాతావరణం ఉష్ణగతిక అసమతుల్యంగా మారింది. ఈ అసమతుల్యత కారణంగా, ధట్టమైన నల్లటి మేఘాలు ఏర్పడతాయి. గతంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో ఇలాంటి వాతావరణం ఉండేది. ఉత్తర మంగళూరుకు ఎగువన ఉంది. కానీ మారుతున్న వాతావరణం కారణంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.
51 శాతం వాలుగా వయనాడ్ భూ భాగం
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం కేరళలోని 43% భూభాగం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఇడుక్కిలో 74%, వయనాడ్ లో 51% భూభాగం కొండ వాలుగా ఉన్నాయి. అంటే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంటుంది. కేరళలోని పశ్చిమ కనుమలు 1,848 చదరపు కి.మీ వైశాల్యంతో వాలును కలిగి ఉన్నాయి.
పశ్చిమ కనుమలు అంటే వయనాడ్, కోజికోడ్, మలప్పురం, ఇడుక్కి, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలు. ఈ జిల్లాల్లో అత్యధికంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. 2019లో కేరళలోని 8 జిల్లాల్లో 80 కొండచరియలు విరిగిపడ్డాయి. అది కూడా కేవలం మూడు రోజుల్లోనే. ఇందులో 120 మంది చనిపోయారు. 2018లో పది జిల్లాల్లో 341 భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.