అశ్లీల చిత్రాల కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఎలా నడిపారు? వీడియోలు ఎవరితో ఎక్కడ తీశారు? ఎలా అప్ లోడ్ చేశారు అనే విషయాలపై విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. ఐపీసీ 420, 34, 292, 293 సెక్షన్ల కింద కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోర్న్ రాకెట్ గుట్టు బయటపడింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు 2009 నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి వాటిని విదేశీ యాప్ ల్లో అప్ లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసును నమోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని తెలిపారు. ఈ విషయంలో తగినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోర్న్ ఫిల్మ్ ను యాప్స్ లో అప్ లోడ్ చేస్తున్నకేసులో రాజ్ కుంద్రాను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని కమిషనర్ హేమంత్ నగరేల్ తెలిపారు. కుంద్రాతో పాటు ఇవ్పటివరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
ముంబై పోలీసు శాఖకు చెందిన ప్రాపర్టీ సెల్ పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియోలు తీశారు. ఈ కేసులో నటుడు గెహనా విశిష్ట్ ను కూడా అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తరువాత వాటిని బీ ట్రాన్స్ ఫర్ ద్వారా విదేశాలకు పంపిస్తారు. భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్ లో అప్ లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ విషయాలు తెలిపారు. ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను రాజ్ కుంద్రా దగ్గర పనిచేసేవాడు. ఉమేశ్ కామత్ ను అరెస్టు చేసిన తర్వాతే ఆ పోర్న్ రాకెట్ లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు.
కుంద్రా ఆఫీసు నుంచే వీ ట్రాన్స్ ఫర్ ద్వారా ఫైల్స్ ను విదేశాలకు పంపేవాళ్లని పోలీసులు తెలిపారు. నటనపై ఆసక్తి ఉండి కెరీర్ లో ముందుకు వెళ్దామని వచ్చే యువ యాక్టర్లను పోర్న్ రాకెట్ గ్యాంగ్ వలవేసి పట్టుకునేది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ల్లో మంచి పాత్రలుకల్పిస్తామని చెప్పి వారితో అశ్లీల చిత్రాలు తీయించేవారు. పోర్న్ రాకెట్ నడుపుతున్న ముఠా నిందితుడడికి ఇక వీడియోతో రెండు లేదా మూడు లక్షలు వస్తాయి. దాంట్లో బాధితులకు 20 లేదా 25 వేలు ఇచ్చే వాళ్లని పోలీసుల విచారణలో తెలిసింది. ముంబైలోని వెస్ట్ మలాడ్ లో ఉన్న మాద్ ఏరియా బిల్డింగ్ లో షూటింగ్ చేసేవాళ్లు. అక్కడ పోలీసులు చేసిన తనిఖీల్లో ఐదుగురు దొరికారు.
ఈకేసులో విచారణ నిమిత్తం రాజ్ కుంద్రాను పోలీసులు కస్టడీకి కోరనున్నారు. రాత్రంతా లాకప్ లోనే ఉన్నారు. తెల్లవారుజామున జేజే ఆసుపత్రిలో రాజ్ కుంద్రాకు వైద్యపరీక్షలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, అశ్లీల వీడియోల కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రా ఉన్నారని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More