Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని అనుకున్నారు. కానీ పోలీసులను ఒక్కసారిగా దారి మళ్ళించి కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వైపు వెళ్లారు.. అక్కడ ఆందోళన చేపట్టారు. అది కాస్త హింసాత్మకంగా మారింది.
రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున కార్గే, ప్రియాంక వాద్ర, కేసి వేణుగోపాల్ వంటి వారు నరేంద్ర మోడీ ఇంటి ముందు నిలబడి నిరసన తెలిపారు. వాస్తవానికి ఒక దేశ ప్రధాని ఇంటి ముందు నిలబడి నిరసన తెలుపడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రక్రియలో రాహుల్ గాంధీ కింద పడిపోయారు.. అంతేకాదు తోపులాటలో ముక్కుకు గాయమైంది. అది అంత తీవ్రమైనది కాదు. కాకపోతే రక్తం రావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. రాహుల్ రక్తాన్ని మోడీ కళ్ళ చూశారని ఆరోపించడం ప్రారంభించింది. సహజంగానే మన సమాజంలో విక్టిమ్ వాయిస్ కు ప్రాధాన్యం ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తన మైలేజ్ కోసం పాకులాడటం మొదలుపెట్టింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారడం.. ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం వంటి సంఘటనలను తన సోషల్ మీడియా గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నది.
రాహుల్ గాంధీని.. ఇతర కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నప్పుడు పోలీసులు కాస్త సమయమనం తో వ్యవహరించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. కొన్ని సందర్భాలలో ఓపికను ప్రదర్శించాలి. నేర్పరితనాన్ని చూపించాలి. అంతేతప్ప సమస్యను పరిష్కరించేటప్పుడు దూకుడుగా వ్యవహరించకూడదు. అలా చేస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. మరి దీన్ని నరేంద్ర మోడీ ఎలా పరిష్కరిస్తారు.. ఈ సమస్యకు ఎలాంటి దారి దీపాన్ని చూపుతారు.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది.






