Homeజాతీయ వార్తలుPolitics behind Religious Riots: మత కల్లోలాల వెనుక రాజకీయం.. హాపూర నుంచి కడప వరకు...

Politics behind Religious Riots: మత కల్లోలాల వెనుక రాజకీయం.. హాపూర నుంచి కడప వరకు ఒకే నిజం

Politics behind Religious Riots: దేశవ్యాప్తంగా ఒకే రకమైన చిత్రం కనిపిస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడప వరకు, మత కల్లోలాల వెనుక దాగి ఉంది ఒక వ్యూహాత్మక రాజకీయం. ఇది కేవలం సంఘటనల పాట కాదు, దేశ సమగ్రతపై చేయబడే దాడి. మత కల్లోలాల వ్యూహం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రాణాప్రతాప్‌ జయంతి సందర్భంగా అల్లర్లు, ఆంధ్రప్రదేశ్‌లో టిప్పు సుల్తాన్‌ జయంతి పేరుతో పార్టీల పోటీ పడుతున్నాయి. కశ్మీర్, మణిపూర్‌లలో అల్లర్లు పెద్ద ప్రాధాన్యత పొందకపోవడం […]

Politics behind Religious Riots: దేశవ్యాప్తంగా ఒకే రకమైన చిత్రం కనిపిస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడప వరకు, మత కల్లోలాల వెనుక దాగి ఉంది ఒక వ్యూహాత్మక రాజకీయం. ఇది కేవలం సంఘటనల పాట కాదు, దేశ సమగ్రతపై చేయబడే దాడి.

మత కల్లోలాల వ్యూహం
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రాణాప్రతాప్‌ జయంతి సందర్భంగా అల్లర్లు, ఆంధ్రప్రదేశ్‌లో టిప్పు సుల్తాన్‌ జయంతి పేరుతో పార్టీల పోటీ పడుతున్నాయి. కశ్మీర్, మణిపూర్‌లలో అల్లర్లు పెద్ద ప్రాధాన్యత పొందకపోవడం వల్ల, రాజకీయ నేతలు ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలపై దృష్టి సారించారు. ఉద్రిక్తతలను పెంచేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు, మరియు ఒక వర్గం ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది. హాపూర్‌లో ధౌలానా ఏరియాలో రాణాప్రతాప్‌ జయంతి ర్యాలీని భగ్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. అక్బర్‌ సైనికాధికారితో యుద్ధం చేసిన రాణాప్రతాప్‌ జయంతిని కొందరు వ్యతిరేకించారు. యోగి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవడం గమనించదగినది – రాళ్లు రువ్వినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ టిప్పు సుల్తాన్‌ జయంతి విషయమై పోటీ పడుతున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్‌ సర్కిల్‌ ఏర్పాటు చేశాడు, కడపలో గత వైసీపీ మేయర్‌ టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తానని వాగ్దానం చేశారు.

ముస్లిం ఓట్ల కోసమే..
అల్మాస్‌గూడ ఏరియాకు టిప్పు సర్కిల్‌ అని పేరుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, హిందువులు దానిని హనుమాన్‌ సర్కిల్‌గా మార్చారు. దీంతో ముస్లింలు రోడ్లపైకి వచ్చి దాడి చేశారు, పోలీసులు గాయపడ్డారు, లాఠీచార్జి జరిగింది. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, శాంతి కమిటీ మీటింగ్‌లో గొడవ ఆపే ప్రయత్నం చేశారు, కానీ సమస్య పరిష్కరించలేదు.

హిందువుల్లో అసంతృప్తిని గుర్తించని నేతలు..
గుంటూరులో మహ్మద్‌ జిన్నా టవర్‌ విషంలో గొడవ జరిగింది. హిందువులు ఆగ్రహించడంతో టవర్‌కు జాతీయ జెండా రంగులు వేశారు. జాతీయ జెండా ఎగురవేయడం మొదలైంది. హిందువులు తలుచుకుంటే ఇలా మార్పు వస్తుంది. ఇది కేవలం మాట కాదు, నిజం. కానీ ప్రశ్న ఎక్కువ ముఖ్యమైనది: హిందువుల్లో పెరుగుతున్న అసంతృప్తి, కోపాన్ని రాజకీయ నేతలు గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవు.

గుణపాటం నేర్చుకోవాల్సిన సమయం
టీడీపీ, వైసీపీ బెంగాల్‌ అస్సాంల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాల్లో మత కల్లోలాల ఫలితాలు ఏమిటో చరిత్ర చెబుతోంది. మత రాజకీయాల్లో లాభం లేదు, కేవలం దేశ విభజనే ఉంది.

మత కల్లోలాల వెనుక ఉన్నది కేవలం ముస్లిం ఓట్ల కోసం రాజకీయం మాత్రమే. ఇది నైతికంగా తప్పు, దేశసమగ్రతకు హానికరం. హిందువుల అసంతప్తిని గుర్తించి, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి. జాతీయత్వం ముఖ్యం, మతం కాదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper