
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ కట్టడికి పాటుపడుతున్న దేశాధి నేతలపై “మార్నింగ్ కన్సల్ట్” ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం.. కోవిద్19 నియంత్రణకి అత్యంత కృషి చేస్తున్న దేశాధి నేతగా భారత్ ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ జాబితాలో చిట్ట చివరి స్థానాన్ని పొందుకున్నారు.
ఇండియాలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలను చేపట్టడంలో ప్రధాని మోదీ, ప్రపంచ దేశాల అధినేతలకంటే ముందు వరుసలో నిలిచారు. “మార్నింగ్ కన్సల్ట్” సర్వే ప్రకారం నరేంద్ర మోడీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ 26 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంకా ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లతో చివరన నిలిచారు.