చైనా సైంటిస్టులు కరోనా వైరస్ పై చేస్తున్న పరిశోధలనల్లో భాగంగా మరో సంచలన వార్తను ప్రకటించారు. కరోనా ఏ విధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందో..? అనే అంశంపై చేస్తున్న పరిశోధనలలో వారికి మరో నూతన విషయం తెలిసింది. ఇప్పటి వరకు, కరోనా సోకిన వ్యక్తి, తుమ్మినా, దగ్గినా, అతనిని తాకినా, లేదా అతను తాకిన వస్తువులను తాకినా.. ఈ వైరస్ సోకే అవకాశం ఉందని చెప్పిన చైనా సైంటిస్టులు ఇప్పుడు మరో కొత్త మార్గంలో కూడా కరోనా వ్యాపిస్తుందని చెబుతున్నారు. కరోనా ఉన్న వ్యక్తి “అపానవాయువు” చేసినా.. ఆ గాలిని పీల్చిన వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని “చావుకబురు చల్లగా” చెప్పారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచి యూరిన్ మరియు మలం శాంపిల్స్ తీసుకుని పరిశోధనలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ పరిశోధనల్లో కరోనా వైరస్ యొక్క తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. అపాన వాయువు విడుదల చేసిన సమయంలో ఇది మరో మనిషికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు.
అయితే అపానవాయువును అడ్డుకునేలా పూర్తిస్థాయిలో ప్యాంట్లు ధరిస్తే కరోనావైరస్ ఎట్టి పరిస్థితుల్లో పక్కవ్యక్తికి సోకే ప్రమాదం లేదని తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ధరించిన ప్యాంట్లు అడ్డుగా ఉండటం వల్ల చాలావరకు ఇది బయటకు రాదని వైరస్ అక్కడే చచ్చిపోతుందని వారు స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం అపానవాయువుతో సోకే వ్యాధులపై పరిశోధనలు చేసినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే ధరించే ప్యాంట్ల వల్ల ఎలాంటి అపాయం ఉండబోదని కూడా చైనా సైంటిస్టులు స్పష్టం చేశారు.