ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత వారం ఖంగారుగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర హోమ్ మంత్రిలతో భేటీ కావడానికి బైటకు చెప్పిన్నట్లు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కావని, వ్యక్తిగత అంశాలను తెలుస్తున్నది. ముఖ్యంగా రస్ అల్ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ అప్రూవర్ గా మారారని తెలుస్తూ ఉండడంతో జగన్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
తాను పాల్పడిన కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు నిమ్మగడ్డ విడమరిచి చెప్పేశారని ప్రచారం జరుగుతున్నది. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ అంతిమ లబ్ధిదారుడు భారీ స్కాంలకు పాల్పడటంలో నిష్టాతుడైన ఏ1గా గుర్తించి తమకు అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిందని కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది.
ప్రధాని, హోమ్ మంత్రిలకు జగన్ సమర్పించిన వినతి పాత్రలను మీడియాకు విడుదల చేయక పోవడం గమనార్హం.
సాక్షి వాళ్లేమో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చే దిశగా చర్చలు జరిగాయని వ్రాస్తే, ఆంధ్రజ్యోతి ఏమో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే విన్నట్టు జగన్ని మోడీ, అమిత్షాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని వ్రాయడం గమనార్హం.
అసలు విషయం మాత్రం రస్ ఆల్ఖైమా జైలులో వున్న మ్యాట్రిక్స్ ప్రసాద్ అనబడే నిమ్మగడ్డ ప్రసాద్ కి మాత్రమే తెలుసంటూ సోషల్ మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి.