Homeజాతీయ వార్తలుModi Target: మహారాష్ట్ర భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ తమిళనాడును కాలుస్తున్న మోడీషాలు

Modi Target: మహారాష్ట్ర భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ తమిళనాడును కాలుస్తున్న మోడీషాలు

Modi Target: దక్షిణానికి ఉత్తరానికి మధ్యన ఉన్న మహారాష్ట్రను మరోసారి బిజెపి గెలుచుకుంది. పేరుకు శివసేన అయినప్పటికీ పెత్తనంతా బీజేపీ దే. ఆవుపుతోనే ఇప్పుడు తెలంగాణలోనూ మీసం మేలేస్తోంది. ఇంతకు మహారాష్ట్రకు, తెలంగాణకు సంబంధం ఏంటి? అక్కడి పరిణామాలు ఇక్కడి పరిణామాలు ఒకటేనా? అసలు మహారాష్ట్రలో బాగా వేసేందుకు బిజెపి ఎప్పటినుంచి చక్రం తిప్పింది? ఇందులో పవార్ పాత్ర ఎంత? ఉద్దో టక్రే స్వయం కృప రాధం ఎంత?

Modi Target
Amith Shah, Modi

తీర్మానం నెగ్గారు

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అసెంబ్లీ లో విశ్వాస తీర్మానం లో నెగ్గారు. ఉద్ధవ్ ఠాక్రే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటు వేశాడు. శివ సేన చీఫ్ విప్ గా నిన్న రాత్రి నియమితులయిన భరత్ ఘోగవాలే విప్ ను ధిక్కరించిన ఠాక్రె తన శాసన సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన విజయ్ వాదేత్తివర్ ఓటింగ్ కు దూరంగా ఉండడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.
నిన్నటి వరకు ఉద్ధవ్ ఠాక్రె శిబిరంలో ఉన్న శివసేన శాసన సభ్యుడు సంతోష్ బంగార్ ఓటింగ్ కి కొద్ది నిమిషాల ముందు షిండే శిబిరంలోకి వచ్చేశాడు దీంతో ఏకనాథ్ షిండే ని బలపరిచిన శివసేన శాసనసభ్యుల సంఖ్య 40కి చేరుకుంది.
బీజేపీ శాసనసభ్యుడు రాహుల్ నర్వేకర్ ని తొలుత మహారాష్ట్ర శాసన సభ స్పీకర్ గా ఎన్నుకోవడం ఒక ఎత్తుగడ. ఇక ఇంతకు ముందు స్పీకర్ ఇచ్చిన 16 మంది షిండే వర్గం ఎమ్మెల్యేల మీద ఇచ్చిన శాసన సభ అనర్హత ఇక వీగిపోయినట్లే. ఈ విషయం కోర్టు లో ఇప్పటికే పెండింగ్ లో ఉంది కానీ ప్రస్తుత స్పీకర్ రాహుల్ నర్వేకర్ రూలింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

జూన్ 20న తిరుగుబాటు

జూన్ నెల 20 న మొదలయిన శివసేన తిరుగుబాటు ప్రహసనం జులై 4 న తాత్కాలికంగా ముగిసింది.
ఏకనాథ్ షిండే ని ముఖ్యమంత్రిగా చేయడం అదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయడం వెనుక అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఇది కచ్చితంగా అమిత్ షా వ్యూహం అని స్పష్టంగా తెలిసిపోతున్నది.
ఇంతకీ ఎవరు బలి పశువు ?
ఒకరు కాదు ఇద్దరు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రె !

Also Read: Film Critic Passed Away: విషాదం : ప్రముఖ సినీ విమర్శకుడు కన్నుమూత.. ఎమోషనలైన పవన్ కళ్యాణ్ !

శరద్ పవార్ వ్యూహం !

ఇచ్చి పుచ్చుకోవడం లో లెక్కలలో తేడా వచ్చి శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తో సొంత కుంపటి పెట్టుకున్నాడు. కానీ అవే కాంగ్రెస్ పోకడలు పోయాడు ఇప్పటివరకు. 2014 నుంచి ఉంటే రెండో స్థానంలోనో లేదా మూడో స్థానంలోనో ఉంటూ వచ్చింది.

బలమైన కేడర్ ఉన్నా

ఎన్స్పీ విదర్భ ప్రాంతంలో బలమయిన కేడర్ ఉంది అదే సమయంలో శివసేన విదర్భ ప్రాంతంలో బలహీనంగా ఉంది. పవార్ వ్యూహం ఏమిటంటే శివసేన ని పక్కకి తప్పిస్తే తాను రెండో స్థానంలో ఉండి రాజకీయ బేరాలు ఆడోచ్చు. శరద్ పవార్ కి ఉద్ధవ్ ఠాక్రే గురుంచి బాగా తెలుసు. ఉద్ధవ్ కి ఏ మాత్రం రాజకీయ అనుభవం లేదు. కేవలం తండ్రి వారసత్వంగా వచ్చిన శివసేన పార్టీ కాబట్టి బాల్ ఠాక్రే తరువాత దానికి అధ్యక్షుడయ్యాడు. ఉద్ధవ్ ఠాక్రే బలం, బలహీనత తన కొడుకు అయిన ఆదిత్య ఠాక్రే. సరిగ్గా ఇక్కడే శరద్ పవార్ వ్యూహ రచన చేశాడు. 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు నుంచి పవార్ ఉద్దవ్ తో తరుచూ సమావేశం అయ్యేవాడు. మహారాష్ట్ర అంటే బాల్ ఠాక్రే కు సొంత ప్రాంతం అలాంటిది బీజేపీ తో కలిసి ప్రభుత్వం పంచుకోవడం ఎందుకు ? నువ్వే ముఖ్యమంత్రివి అవ్వాలిఎం అలాగే నీ తరువాత నీ కొడుకు ఆదిత్య ఠాక్రే ముఖ్యమంతి అవ్వాలి. కానీ వేరొకరికి ఆ అవకాశం ఇవ్వవద్దు అంటూ హిత బోధ చేశాడు. ఈ మాటలు ఉద్ధవ్ మీద బాగానే పనిచేశాయి. 2019 ఎన్నికల ముందు శివసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముందు రెండున్న సంవత్సరాలు ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉండేట్లు తరువాతి రెండున్నరేళ్లు ఫడ్నవీస్ అధికారం లో ఉండేట్లు ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఎన్నికల ఫలితాలు రాగానే శరద్ పవార్ ఓ రాయి విసిరాడు అది గురిగా తగిలింది. ఉద్ధవ్ కాకుండా తన కొడుకు ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశాడు ఉద్ధవ్. దాంతో ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆదిత్య ఠాక్రే కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేశ ఆర్ధిక రాజధానిని అప్పచెప్పడం బీజేపీ కి ఇష్టం లేక ఉద్ధవ్ ప్రతిపాదనని తిరస్కరించింది.
పవార్ మళ్ళీ రంగంలోకి దిగాడు. ప్రస్తుతానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి తరువాత మెల్లగా ఆదిత్య ఠాక్రే ని ముఖ్యమంతిగా చేద్దువు అంటూ నేను కాంగ్రెస్ లు కలిసి మద్దతు ఇస్తాం ఈ విషయంలో అని నచ్చచెప్పాడు. అంతే కాదు పవార్ కూతురు అయిన సుప్రియా సూలే కూతురిని ఆదిత్య కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. జరగబోయే పరిణామాలని ఏ మాత్రం ఊహించకుండా ఉద్దవ్ తల ఊపాడు. దాంతో మహా వికాస్ అఘాడి పేరుతో కూటమిని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ని పీఠం మీద కూర్చోబెట్టి ఏ మాత్రం ప్రాధాన్యత లేని పర్యాటక శాఖని ఆదిత్యకి ఇచ్చి హోమ్, ఆర్థిక శాఖ లో తన పార్టీకి చెందిన వారిని కూర్చోపెట్టాడు పవార్. మరికొన్ని కీలక శాఖలని కాంగ్రెస్ చేతిలో పెట్టాడు.

పవర్ గేమ్ !

పవార్ ఎంతగా ఉద్ధవ్ ని ప్రభావితం చేసాడంటే మీ నాన్న సిద్ధాంతం అయిన హిందుత్వ ని పక్కన పెట్టేసి సెక్యులర్ గా మారితేనే నీ కొడుకు ఆదిత్య ఎప్పటికీ ముఖ్యమంత్రి పీఠంలో ఉండగలుతాడు. డానికి సోనియా మద్దతు ఉంటుంది. కాబట్టి బీజేపీని, హిందుత్వ ఎజెండాను వదిలివేయమని సలహా ఇచ్చాడు.
1.పవార్ సలహాను చాలా శ్రద్దగా పాటించాడు ఉద్ధవ్. కొవిడ్ సమయంలో ముంబై ని పట్టించుకోలేదు సరికదా ముంబై నుంచి అధికశాతం పన్నుల వాటా కేంద్రానికి వెళుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో కోవిడ్ ను నియంత్రించకుండా జాగ్రత్త పడ్డాడు ఉద్ధవ్. ఒక్క ముంబై ఏమిటి మొత్తం మహారాష్ట్ర నే ఎక్కువ కాలం ఆంక్షలలో ఉండేట్లు చేయగలిగాడు. ఈ చర్య పరోక్షంగా కేంద్రం మీద ఒత్తిడిని పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి అప్పులు చేయాల్సి వస్తుంది ! కానీ ప్రజలలో దీని మీద వ్యతిరేకత పెల్లుబుకింది. కానీ ఉద్ధవ్ లెక్క చేయలేదు.

కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పాల్ఘార్ సాధువుల సమాచారం ఒక పోలీస్ చెక్ పోస్ట్ నుంచి రెండో పోలీస్ చెక్ పోస్ట్ కి ఫోన్ ద్వారా పోలీసులే సమాచారం ఇచ్చి మరీ దాడి చేయించారు అన్న సంగతి ప్రజలు బాగా గుర్తించారు. కానీ ఉద్ధవ్ లెక్క చేయలేదు. సరికదా దీని మీద మాట్లాడడానికి శివసేన శాసనసభ్యులు ఉద్ధవ్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసినా వాళ్ళని పట్టించుకోలేదు.
ఆదిత్య ఠాక్రే మీద హనీ ట్రాప్ జరిగింది సహజంగా ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిని అలవాటు చేయడంలో సఫలీకృతం అయ్యాడు పవార్. దాని ఫలితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య. చాలా హై ప్రొఫైల్ హత్య అది. ప్రొఫెషనల్ గ్యాంగ్ చేసింది. పవార్ కు దావూద్ తో ఉన్న లింకు అందరికీ తెలిసిందే ! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసును మూసేయించాడు పవార్. సో కొడుకును హత్య కేసు నుంచి బయటపడేయడం, అదే సమయంలో ఆదిత్య ఠాక్రే చేసిన పనుల గురుంచి పవార్ దగ్గర సమాచారం ఉండడంతో ఉద్ధవ్ కి ఇక ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు పవార్.
సోనియా ఎవరు ? అంటూ రిపబ్లిక్ టీవి ఆర్నాబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యల మీద పవార్ దగ్గరుండి మరీ ఆర్నాబ్ ని రోడ్డు మీదకి తీసుకొచ్చి సంకెళ్ళు వేసి మరీ జైల్లో పెట్టడం ప్రజలలో తీవ్ర ఆగ్రహజ్వాలని రగిల్చినా ఏ మాత్రం పట్టించుకోలేదు ఉద్ధవ్.
శివసేన శాసన సభ్యులకి తనతో మాట్లాడానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేయడంలో పవార్ విజయవంతం అవగలిగాడు. మరో వైపు శివసేన మంత్రులుగా ఉన్న కార్యాలయాలకి ఆదిత్య ఠాక్రే వెళ్ళి తనిఖీలు చేయడం ఎవరికి కాంట్రాక్ట్ లు ఇవ్వాలో తానే సూచించడం శివసేన మంత్రులకు, శాసనసభ్యులకు నచ్చలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులతో శివసేన శాసనసభ్యులు తమకి కావాల్సిన పనులని చేయించుకోవడానికి బతిమాలాల్సిన పరిస్థిని తీసుకొచ్చాడు పవార్.
..
అమిత్ షా చాణక్యం

జరుగుతున్న ఒక్కో పరిణామాన్ని నిశితంగా పరిశీలుస్తూ వచ్చిన అమిత్ షా మొదట దెబ్బ పవార్ మీదనే వేశాడు..అది ముఖేష్ అంబానీ ఇంటి ముందు బాంబు పెట్టిన కేసులో ఒక్కొక్కరిని జైల్లో పెట్టడం తో మొదలు పెట్టాడు చివరికి హోం మంత్రి అరెస్ట్ అవడం, వెంటనే నాకు ప్రాణ భయం ఉందని పోలీస్ కమిషనర్ పరారీ అవడం అనేది పవార్ కి పడ్డ మొదటి పెద్ద దెబ్బ.
రెండో దెబ్బ నవాబ్ మాలిక్ [ఎన్సేపీ] ని మనీ లాండరింగ్ కేసులో బుక్ చేయడం.. అదీ దావూద్ ద్వారా చేసినట్లు ఆధారాలు దొరకడం ఆపై జైల్లో వేయడం జరిగిపోయాయి. దాంతో పవార్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిని కల్పించాడు అమిత్ షా.
అంతే కాదు అనిల్ దేశముఖ్ [హోమ్ ], నవాబ్ మాలిక్ లకి బెయిల్ దొరకకుండా పోవడం కూడా పవార్ చేతులు కట్టేసినట్లు అయ్యింది.

మిషన్ షిండే షురూ

పవార్ ని ఎప్పుడయితే కట్టడి చేశాడో ఏకనాథ్ షిండే తో పాచికలు వేయించడం మొదలుపెట్టాడు ఫడ్నవీస్. అప్పటికే ఉద్ధవ్ ఠాక్రె తో విసిగిపోయిన శివసేన శాసనసభ్యులు, మంత్రులకు ఏకనాథ్ షిండే వ్యూహం ఎడారిలో ఒయాసిస్ లా కనిపించింది. వెంటనే ఒక్కొక్కరూ షిండే తో కలవడం చివరకి ఉద్ధవ్ తో పాటు పవార్ పతనానికి దారి తీసింది.
ఫడ్నవీస్ ని తక్కువ చేశారా ?
లేదు. శ్రీ కృష్ణుడు రధ సారధి అయినంత మాత్రాన భారత యుద్ధంలో ఆయనకి విలువ తగ్గిందా ? సారధిగా శ్రీ కృష్ణుడే లేకపోతే అర్జునుడు యుద్ధం గెలవడంలో కీలక పాత్ర పోషించేవాడా ? శ్రీ కృష్ణుడికి కావలసింది పాండవుల విజయం. ఫడ్నవీస్ కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు. మహారాష్ట్ర లో శరద్ పవార్, ఠాక్రే వంశ పారంపర్య రాజకీయాలకి చెక్ పెట్టాలి అంటే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండడమే మేలు. 80 వ పడిలో ఉన్న శరద్ పవార్ ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండలేడు. తన తరువాత తన కూతురుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలంటే సుప్రియా సూలే అంత తెలివికలది కాదు . ఒక చిన్న ఉదాహరణ : ఏకనాథ్ కి 40 ఎమ్మెల్యేలు ఉంటే ముఖ్యమంత్రి అయిపోతాడా ? అంటూ సుప్రియా శూలే చేసిన వ్యాఖ్య విన్న వాళ్ళకి ఎవరికయినా ఇట్టే అర్ధం అయిపోతుంది ఆవిడకి ఎంత తెలుసో అని.

ఇక పాల్ఘార్ సాధువుల హత్య ఉదంతం మీద ఎవరి ప్రోద్బలం తో పోలీసులు అలా ప్రవర్తించారో ఇక ముందు విచారణలో తేలుతుంది. అది ఇటు తిరిగి అటు తిరిగి అప్పటి హోమ్ మంత్రి దేశముఖ్ మీదకి వెళుతుందా లేక పవార్ మీదకి వెళుతుందా అనేది అనిల్ దేశముఖ్ ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది పవార్ రాజకీయ జీవితానికి మంగళం పాడే చర్య అవుతుంది.
ఇక శివ సేన పార్టీ ఎవరికి చెందుతుంది అన్నది ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్ లు తేలుస్తాయి కాబట్టి ఇప్పట్లో ఉద్ధవ్ ఠాక్రె కొలుకునే స్థితి ఉండబోదు. పైగా తనకి సలహా ఇచ్చిన శరద్ పవార్ కూడా ఆత్మ రక్షణలో పడ్డాడు కాబట్టి ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం లేదు. కాంగ్రెస్ ఎటూ క్షీణ దశలోనే ఉంది కాబట్టి అధికారం కోసం బీజేపీ తాపత్రయ పడాల్సిన పని లేదు. ఫడ్నవీస్ విషయంలో బీజేపీ భవిష్యత్ రాజకీయ వ్యూహ రచనలో ఇది ఒక భాగంగా గుర్తించాలి. మహారాష్ట్ర విషయంలో బీజేపీ కి ఎలాంటి అనుమానాలు లేవు.
..
ఆపరేషన్ సౌత్ !

ఇప్పుడు ఇక బిజెపి దృష్టి మొత్తం తమిళనాడు, తెలంగాణ మీద మాత్రమే ! కానీ తెలంగాణ షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుంది. చేరికల కమిటీగా చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను షా నియమించాడు. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గుట్టు దాదాపు బిజెపికి చేరినట్టే!

Also Read: Actress Meena: భర్త చనిపోయిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న మీనా

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular