Homeఆంధ్రప్రదేశ్‌సైద్ధాంతికంగా విడిపోయిన కేసీఆర్, జగన్

సైద్ధాంతికంగా విడిపోయిన కేసీఆర్, జగన్

KCR Jagan

భిన్న వ్యక్తులు, భిన్న పాలనలు.. అయినా తెలుగు రాష్ట్రాలు ఒక్కటే. కానీ వారి అవసరాల రీత్యా విడిపోతున్నారు. జనాభా పరంగా.. సంస్కృతి, సంప్రదాయాలు, యాసభాషల పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా వైవిధ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ రెండు తెలుగు మాట్లాడే రాష్ట్రాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. కరోనాని నియంత్రించే నిర్ణయాలలో ముఖ్యమంత్రులు వైయస్ జగన్.. కేసిఆర్ ఈ సెకండ్ వేవ్ లో భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

లాక్డౌన్ పరిమితులను తాజాగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీఎం కేసీఆర్ తన రాష్ట్ర ప్రజలకు సడలింపు ఇవ్వగా.. జగన్ మాత్రం అలాంటి మినహాయింపులకు దూరంగా తాను విధించిన కర్ఫ్యూను ఖచ్చితంగా పాటిస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ వంటి మహానగరం ఉన్నా కూడా కేసీఆర్ కరోనాను తేలికగా తీసుకున్నారన్న టాక్ ఉంది. అందుకే చాలా ఆంక్షలను ఎత్తివేశారంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం కంటే కూడా కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పటికీ కఠినమైన కర్ఫ్యూ విధిస్తూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది.

కేసీఆర్ కూడా విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు జగన్ పది మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలని మొండిగా ఉన్నాడు. మొదటి వేవ్ లో లాగ్ డౌన్ విధించడం నుండి పరీక్షల రద్దు వరకు కేసీఆర్ నిర్ణయాలను జగన్ ఎక్కువగా అనుసరించారు.

రెండవ వేవ్ లో ఆదాయం తగ్గడంతో కేసీఆర్ సడలింపులు ఇస్తున్నాడు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారాన్ని కేసీఆర్ స్వయంగా తీసుకున్నాడు. రాష్ట్ర హైకోర్టుతో చాలా చీవాట్లను తిన్నారు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వైఎస్ జగన్ వైపు చాలా భిన్నమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో ఇన్నిరోజులు లాక్ డౌన్ కర్ఫ్యూను కొనసాగించడం.. సీఎం ఇప్పటికీ తనకు చాలా ముఖ్యమైన పథకాలకు డబ్బును భారీగా పంచడం చేస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాడు.

రాజకీయంగా టిఆర్ఎస్ అక్షరాలా కేంద్రంతో యుద్ధం చేస్తోంది. కానీ జగన్ వైయస్ఆర్సిపి వారికి లభించే ప్రతి అవకాశంలోనూ మోడీ బిజెపిని శాంతింపజేస్తోంది. కాబట్టి ఈ రెండింటి మధ్య కొన్ని సైద్ధాంతిక వ్యత్యాసాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. తరువాతి కాలంలో రాజకీయ అవసరాల ప్రకారమే నడవాలని కోరుకుంటే జగన్.. కేసీఆర్ మధ్య సంకీర్ణాన్ని ఆశించడం కష్టమే అని చెప్పకతప్పదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular