బీసీసీఐ ఖర్చు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 13వ ఐపీఎల్ సీజన్ ప్రైజ్మనీని భారీగా తగ్గించింది. గత సీజన్తో పోలిస్తే సగానికి సగం తగ్గించడం గమనార్హం. ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలకు తెలియజేసింది.
ఛాంపియన్గా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిలో మార్పులు చేశాం. ఛాంపియన్గా నిలిచే జట్టుకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్లు లభిస్తాయి. రన్నరప్కు రూ.12.5 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్లు దక్కుతాయి అని బీసీసీఐ వెల్లడించింది.
ఇక క్వాలిఫయిర్స్కు అర్హత సాధించిన మిగిలిన రెండు జట్లకు రూ.4.37 కోట్లు అందిస్తామని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అన్ని ఫ్రాంఛైజీలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి స్పాన్సర్షిప్స్ వంటి మార్గాలు వారికి ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రైజ్మనీపై ఈ నిర్ణయం తీసుకున్నాం అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.