తెలంగాణలో విద్యా శాఖ అధికారులు, ఇంటర్ పరీక్షా పేపర్ల వాల్యుయేషన్ అనుకున్నదానికంటే ముందుగానే ప్రక్రియ పూర్తి చేసేలా ఉన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించేందుకు ఇంటర్ బోర్డ్ రెడీ అవుతోంది. జూన్ 8 తర్వాత ఎప్పుడైనా ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ ఉంది. ఇప్పటికే సెకండ్ ఇయర్ పరీక్షల పత్రాల్ని చెక్ చేశారు. వాల్యుయేషన్ పూర్తైంది. ఆ వివరాల్ని కంప్యూటర్లలో ఎంటర్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆన్సర్ షీట్లు… ఇంటర్ బోర్డుకు చేరినట్లు తెలిసింది.
ముందుగా అనుకున్న ప్లానైతే… మొదట సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేసి… తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ… ఇప్పుడు వాల్యుయేషన్ వేగంగా పూర్తవుతోంది. శని, ఆది వారాల్లో కూడా ఇది కొనసాగుతోంది. ఒక్కో లెక్చరర్… 45 ఆన్సర్ షీట్లను చెక్ చేస్తున్నారు. కాబట్టి… ఒకే రోజు రెండు ఫలితాల్నీ ప్రకటించాలని అనుకుంటున్నారు. 28 తర్వాత ఫస్ట్ ఇయర్ ఫలితాల్ని కంప్యూటర్లలో ఫీడ్ చేస్తారు. అది మరో వారంలో పూర్తి కావచ్చు. ఆ తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి ఇంటర్ బోర్డు… ఫలితాలు ప్రకటించనుంది.
ఇక ఎంసెట్ జులై 8 నుంచి జరగనుంది. ఆలోపే సప్లిమెంటరీ పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇంటర్ రిజల్ట్స్ నాడే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరిపేదీ చెబుతారు. జూన్ చివర్లో ఇవి మొదలై… జులై మొదటి వారంలోగా ఇవి పూర్తవుతాయని తెలుస్తోంది. ఎంసెట్ లో ఇంటర్ ఫలితాల్ని కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. ఇక సెప్టెంబర్ నుంచి కొత్త విద్యా సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. అయితే.. ఇంటర్ తరగతులు మాత్రం… ఆగస్టు నుంచే ప్రారంభించేలా బోర్డు ప్రయత్నిస్తోంది. అందుకు టెక్ట్స్ బుక్స్ రెడీ చేస్తోంది.