Homeజాతీయ వార్తలుBudget 2025 : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో దూసుకుపోతున్న భారత్ .. 2025 నాటికి...

Budget 2025 : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో దూసుకుపోతున్న భారత్ .. 2025 నాటికి మన టార్గెట్ అదే

Budget 2025 : ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భారతదేశం ఈ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం, సాఫ్ట్‌వేర్ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తూ జీడీపీలో దాదాపు 7.5 శాతం లభిస్తోంది. అయితే, ఈ రంగం 2025 నాటికి 10 శాతానికి చేరుకోబోయే అంచనాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

AI ఎక్స్‌లెన్స్ సెంటర్ ప్రారంభం:
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్‌లో AI ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని కోసం రూ.500 కోట్ల పెట్టుబడి అవసరమని తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు ఏఐ ద్వారా పూర్తిగా మారిపోతున్నాయి. ఈ మార్పులో భారత్ కూడా ప్రధాన పాత్ర పోషించాలి. ఏఐ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిని గడుచుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.

భారత్ AI రంగంలో పెద్ద మార్పులు:
ఇటీవల భారతదేశం 10 నెలల్లో స్వంత లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ (LLMs) రూపొందించడానికి సిద్ధంగా ఉందని ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మోడల్స్‌ సొంత టెక్స్ట్‌ను జనరేట్ చేయడం, ఇతర పనులు చేయడం వంటి కృత్రిమ మేధన పనులను నిర్వహిస్తాయి. ఇవి చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి ఆధునిక AI మోడల్స్‌లా పని చేస్తాయి. ప్రస్తుతం భారత్‌లో AI మోడల్స్ 10,000 జీపీయూలను దాటాయి. దేశం 18,600 జీపీయూల లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ప్రస్తుతం డీప్‌సీక్‌ 2,000 జీపీయూలు, చాట్‌జీపీటీ 4 వెర్షన్‌ను 25,000 జీపీయూలతో అభివృద్ధి చేసింది.

భారత్‌ AI పరిశ్రమలో కీలకమైన మార్పులు:
భారత్‌ AI పరిశ్రమలో ముందడుగు వేయడానికి అనేక చర్యలను తీసుకుంటోంది. AI రీసెర్చ్, అనువర్తనాలు , విద్యాపరమైన రంగాలలో ఆధిపత్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి AI ఎక్స్‌లెన్స్ సెంటర్, ఇతర పరిశోధనా కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

అమెరికా, చైనా పోటీ:
ప్రపంచంలో ప్రస్తుతం AI పరిశ్రమలో America, China రెండు దేశాలు ఘన పోటీలో ఉన్నాయని చెప్పవచ్చు. 2030 నాటికి AI వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 15.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సాధించే అంచనాలు ఉన్నాయి. చైనా, అమెరికా ఇప్పటికే ఈ రంగంలో విజయం సాధించడానికి పోటీ పడుతున్నాయి. చైనా డీప్‌సీక్ పేరిట జీపీటీ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది అమెరికా ఆధిపత్యానికి గండికొట్టింది. భారత్, ఈ రంగంలో ప్రాధాన్యత పొందేందుకు కృషి చేస్తూ, తన పరిజ్ఞానాన్ని మరింత పెంచుకునేందుకు, ఐటీ రంగాన్ని మరో దశకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. AI పరిశ్రమలో భారత్‌ పోటీపడటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కీలకమైన పాత్ర పోషించేందుకు అడుగులు వేస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular