New Income Tax Bill 2025
New Income Tax Bill 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 న్యూ ఇన్కమ్ టాక్స్ బిల్ను ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది ఆరు దశాబ్దాల పాత 1961 నాటి ఆదాయపన్ను చట్టానికి బదులుగా రాబోతుంది. ఈ కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. న్యూ ఇన్కమ్ టాక్స్ బిల్లో మొత్తం 536 సెక్షన్లు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కేవలం 622 పేజీలలో సమర్పించబడ్డాయి. కాగా, పాత చట్టంలో 298 సెక్షన్లు, 14 షెడ్యూల్స్ ఉండగా, మొత్తం 823 పేజీలు ఉన్నాయి. ఈ కొత్త చట్టం ప్రధానంగా సేలరీ సెక్షన్లో టాక్సబుల్ ఇన్కమ్ నిర్వచనాన్ని సులభతరం చేయాలని లక్ష్యంగా రూపొందించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు పన్ను నివాస(tax residency) ప్రమాణాలను పునర్నిర్వచిస్తుంది. ఇది ప్రవాస భారతీయులపై (NRI) పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా భారతదేశంలో రూ. 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించి పన్నులు చెల్లించని వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ కొత్త నియమం ప్రకారం.. స్వదేశంలో ఉంటూ 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు భారత పౌరులుగా పరిగణించబడతారు. భారతదేశంలో సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చర్య తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం NRI హోదా దుర్వినియోగం, పన్ను ఎగవేతను నిరోధించడం. ఈ బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి ఒక పన్ను సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో గడిపినా లేదా 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపినా లేదా నాలుగు సంవత్సరాలలో మొత్తం 365 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపినా అతను ఇక్కడి పౌరుడిగా పరిగణించబడతారు. అతని ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఒక వ్యక్తి భారతీయ విమానయాన సంస్థ లేదా ఓడలో సిబ్బందిగా భారతదేశం నుండి బయలుదేరినా లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళితే అతను 60 రోజుల నియమం కింద అతడిని కవర్ చేయరు. భారతదేశానికి వచ్చే ఎన్నారైలకు కూడా ఈ షరతు నుండి మినహాయింపు ఉంటుంది. భారతదేశానికి వచ్చే వ్యక్తి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే (విదేశీ వనరుల నుండి వచ్చే ఆదాయం మినహా), 60 రోజుల నియమాన్ని 120 రోజులకు పెంచుతారు. భారతదేశ పన్ను వ్యవస్థ పౌరసత్వం కంటే దేశంలో ఒక వ్యక్తి ఉనికిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, NRIలు భారతదేశంలో సంపాదించే ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడుతుంది. అయితే దేశం వెలుపల వారు సంపాదించే ఆదాయం పన్ను రహితంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది భారతదేశంలో ఉంటూ డబ్బు సంపాదిస్తూనే, పన్నులను ఎగవేసేందుకు NRI హోదాను ఉపయోగించుకుంటున్నారు.కొత్త నియమం పన్ను ఎగవేతను నిరోధిస్తుంది. విదేశాల నుంచి వచ్చి రూ15లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ పన్ను ఎగ్గొట్టే వారు ఇక కొత్త బిల్లు కింద తప్పించుకోలేరు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: People living in the country and earning more than rs 15 lakhs will have to pay tax on their income
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com