Homeజాతీయ వార్తలుపరాయి మహిళపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే?

పరాయి మహిళపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే?

Husband illegal affairపచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబాన్ని వీధిన పడేలా చేస్తున్నారు. సొంత ఇంటిలోనే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పిల్లల్ని సైతం పక్కన పెడుతున్నాడో ప్రబుద్దుడు. కలకాలం తోడుంటానని చేసిన బాసలు పక్కన పెట్టాడు. పెళ్లినాటి ప్రమాణాలు మరిచిపోయాడు.

నూరేళ్లు తోడుండాల్సిన భర్త పక్కదారి పట్టడంతో భార్య కన్నీరు మున్నీరు అయింది. ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ లో చోటుచేసుకున్న సంఘటన విస్తుగొలుపుతోంది. మండల కేంద్రానికి చెందిన దంపతులు 25 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన భర్త నిత్యం భార్యను కొడుతుండేవాడు.

దీంతో అతడి వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడు మరో యువతిని తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెట్టాడు. కట్టుకున్న భార్యను వదిలి పరాయి కాంతతో కులికాడు. దీంతో భార్య కుమిలిపోయింది. కంట తడి పెట్టుకుంది. అయినా తనలోని ధైర్యాన్ని కోల్పోలేదు. భర్త పరాయి మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది.

మహిళలను వెంటబెట్టుకుని ఇంటికి చేరుకుని సదరు యువతి, భర్తను చితకబాదింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. అనంతరం సదరు యువతిని అతడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular