నిర్మలా సీతారామన్ ఈరోజు చివరి విడతగా మరికొన్ని ప్రకటనలు చేసారు. దీనిలో సంస్కరణలు, వుద్దీపనలు, ఉపశమనాలు వున్నాయి. దీనితో మొత్తం 21 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజి ని ప్రకటించినట్లయ్యింది. ఇందులో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఇంతకుముందే ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1 లక్ష 93 వేల కోట్లు, రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన 8 లక్షల 1 వేయి కోట్లు వున్నాయి. అంటే ఇప్పుడు ప్రకటించినవి షుమారు 11 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఇందులో ఈరోజు ప్రకటించిన 40 వేల కోట్ల రూపాయల అదనపు గ్రామీణ ఉపాధి పధకం నిధులు కూడా వున్నాయి. ఇప్పుడు ఈరోజు ప్రకటించిన పధకాల వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం.