Homeఆంధ్రప్రదేశ్‌పోలవరం బడ్జెట్లో కేంద్రం వాటా తేలేనా?

పోలవరం బడ్జెట్లో కేంద్రం వాటా తేలేనా?

Polavaram budget
పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ లో కేంద్రం వాటా ఎంతో శుక్రవారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తేల్చేందుకు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. 2017-18 లో సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా? లేక 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన 2013-14 అంచనా రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని చెబుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సమావేశం గురువారమే జరగాల్సి ఉండగా.. షెకావత్‌ రాజస్థాన్‌ నుంచి రాలేకపోవడంతో శుక్రవారానికి వాయిదాపడింది.

Also Read: వైఎస్ కు దోస్తులు.. జగన్ కు శత్రువులు..!

గత ప్రకటన ఇదీ..
2013-14 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇవ్వగలమని.. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది. పీపీఏ అత్యవసర భేటీలో కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ఆమోదిస్తూ అథారిటీ తీర్మానం చేసింది. అయితే.. 2017-18 సవరించిన అంచనాల మేరకు రూ.47,725.74 కోట్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో గట్టిగా కోరింది. రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేయలేమని.. భూసేకరణ, సహాయ పునరావాసానికే రూ.28,000 కోట్ల వరకూ వ్యయమవుతుందని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారు. కానీ.. కేంద్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాథాన్యత నెలకొంది. ఈ స్మావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్‌, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా పాల్గొననున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular