16th Finance Commission : ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 16వ ఆర్థిక కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని ఈ కమిషన్, 2026-31 కాలానికి గాను కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇచ్చే వాటాను, నిధుల పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలను వెల్లడించింది.
16వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాల వాటాను 41% వద్దే కొనసాగించాలని సిఫార్సు చేసింది. ఇది 15వ ఆర్థిక కమిషన్ నిర్ణయించిన వాటాకు సమానం. అనేక రాష్ట్రాలు తమ వాటాను 50%కి పెంచాలని కోరినప్పటికీ, కేంద్రం వద్ద ఉన్న ఆర్థిక వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని కమిషన్ పాత శాతాన్నే కొనసాగించింది.
ఒక రాష్ట్రానికి ఎంత వాటా రావాలి అనేది నిర్ణయించడానికి ఈసారి కమిషన్ ఒక సరికొత్త అంశాన్ని చేర్చింది. అదే “రాష్ట్రం యొక్క జీడీపీ సహకారం”. దీనివల్ల ఆర్థికంగా మెరుగ్గా రాణిస్తున్న రాష్ట్రాలకు ప్రయోజనం కలుగనుంది.
కొత్తగా చేర్చిన జీడీపీ సహకారం మరియు ఇతర నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటి రాష్ట్రాలకు గతంలో కంటే కొంత మెరుగైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
16వ ఆర్థిక కమిషన్ సిఫార్సులు “పనితీరుకు గుర్తింపు” ఇచ్చేలా ఉన్నాయి. కేవలం జనాభా లేదా వెనుకబాటుతనం మాత్రమే కాకుండా, దేశ అభివృద్ధికి రాష్ట్రాలు ఇచ్చే ఆర్థిక సహకారాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవడం ఒక చారిత్రక మార్పు.
16 వ ఆర్థిక కమిషన్ రాష్ట్ర వాటాలు ఎలా విభజించింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.