
కరోనా కారణంగా ఇప్పుడు ఎవరి ఫేస్లకు చూసినా మాస్క్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో మాస్క్ ఒక్కో డిజైన్లో రూపొందిస్తున్నారు. ఒక రకంగా చూస్తే.. ఆరోగ్యానికి మేలు చేసే ఈ అలవాటు మంచిదే అయినా.. మాస్కుల వినియోగంపై సరైన అవగాహన ఉన్న వారు కొద్దిమందేనని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రధాని మోడీ వినియోగించే మాస్కు ఏమిటి? దాని ఖరీదు ఎంత? ఇప్పటివరకు మాస్కుల కోసం మోడీ మాష్టారు ఎంత ఖర్చు చేశారు? లాంటి బోలెడన్ని సందేహాలు పలువురికి వస్తాయి.
Also Read: పాక్పై ఇరాన్ సర్టికల్ స్ట్రైక్
కానీ.. వారంతా తమకు వచ్చిన డౌట్లను అలానే ఉంచేసుకుంటారు. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా.. అలాంటి ప్రయత్నమే చేశారు హైదరాబాద్కు చెందిన రాబిన్ గతేడాది డిసెంబర్ లో సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రధాని మోడీ వినియోగించే మాస్కుకు సంబంధించిన పలు ప్రశ్నల్ని అడిగి వాటికి సమాధానాలు కోరారు.
Also Read: జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు
మోడీ ఎలాంటి మాస్కు ధరిస్తున్నారు? వాటి విలువ ఎంత ఉంటుంది? ఆయనకు వ్యాక్సిన్ వేశారు? లాంటి ప్రశ్నలకు స్పందించింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) కింద రాబిన్ అడిగిన వివరాలు వ్యక్తిగతమైనవని.. మాస్క్ వివరాలు.. దానికైన ఖర్చు వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ప్రధానికి అయ్యే మాస్కు ఖర్చుల్ని ప్రభుత్వం భరించదని బదులిచ్చారు. ఇప్పుడు ఈ టాపిక్ చర్చనీయాంశమైంది. గతంలో ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి వాడుతున్న మాస్కులపైనా నెటిజన్లు నెట్లో చాలా వరకు సెర్చ్ చేశారు. చివరకు ఆయన వాడేవి కేవలం 40 రూపాయలవేనని వెల్లడైంది.
మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్