Homeఆంధ్రప్రదేశ్‌కొత్త జిల్లాల ఏర్పాటుకు అప్పటి వరకు ఆగాల్సిందేనా..?

కొత్త జిల్లాల ఏర్పాటుకు అప్పటి వరకు ఆగాల్సిందేనా..?

New Districts in AP
ఏపీలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ అన్నట్లుగా వివాదం ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. తాజాగా.. స్థానిక సంస్థల ఎన్నికల మీద వివాదం కొనసాగుతోంది. ఆ మధ్య అభివృద్ధి పనులకు ఎస్‌ఈసీ పర్మిషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు సవరించాలని ఏపీ సర్కార్‌‌ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే.. అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చేసింది.

Also Read: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంత ఖర్చా?

జిల్లాల విభజనకు సంబంధించి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అభ్యంతరాలు తెలుపుతూ ఏపీ సర్కార్‌కు లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. ఇంకా ఆ ప్రక్రియను రద్దు చేయలేదు. ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపైనా స్పష్టత లేదు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగానూ లేదు. ఈ కారణంగా ఎన్నికల అంశం ప్రస్తుతానికి పీటముడి పడింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా కారణంగా చెబుతున్న ఏపీ ప్రభుత్వం.. ఇతర ఏ పనులనూ ఆపడం లేదు. అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటునూ వేగం చేసింది. 32 జిల్లాలను చేయాలనుకుంటున్నట్లుగా మంత్రి వనిత ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా సమీక్షలు చేస్తున్నారు. జవరిలో కొత్త జిల్లాలో ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు 13 జిల్లాల ప్రాతిపదికనే జరుగుతున్నాయి. కాబట్టి.. అవి పూర్తయ్యే వరకూ జిల్లాల విభజన వద్దని ఎస్‌ఈసీ కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చేసుకోవచ్చని ఆయన ఉద్దేశం.

Also Read: సీఎం జగన్ కు మరో షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ

అందుకే.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌‌ పదవీ కాలం ముగిసే వరకూ ఎన్నికలు వద్దంటూ ఏపీ సర్కార్‌‌ పట్టుబడుతోంది. కాగా.. ఆయన పదవీ కాలం వచ్చే మార్చి వరకు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం తనకు నచ్చిన ఎన్నికల కమిషనర్‌ను అపాయింట్ చేసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. కానీ అప్పటిదాకా జిల్లాల విభజన ఆపాల్సి ఉంటుంది. లేకపోతే.. ఇప్పుడే ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. తాను స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందేనని ఉత్తర్వులు తెచ్చుకున్నందున ఈసీని కాదని.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular