ఓదార్పు యాత్ర అంటే టక్కున గుర్తు వచ్చేది జగనే. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది తనువు చాలించారు. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆ ఓదార్పు యాత్రతో ఇంటింటికీ వెళ్లి బాధిత కుటుంబాలను కలిశారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ ఓదార్పు యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ కుదుపులకు దారితీసింది. ఏకంగా ఆ ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం అభ్యంతరం చెప్పడంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. సొంత పార్టీ కూడా పెట్టేశారు.
Also Read: వైసీపీలోకి ‘గంటా’.. విజయసాయి క్లారిటీ!
అయితే.. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అయ్యారు. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 4న గురువారం కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. గురువారం కర్నూలు, 5న తిరుపతి, 6న విశాఖపట్నం, 7న విజయవాడ, 8న గుంటూరులో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై ప్రత్యర్థులు, నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతో సాయంత్రానికి ఎవరు బరిలో నిలుస్తున్నారో స్పష్టత రానుంది.
అయితే.. నిన్నటివరకు వచ్చిన నామినేషన్లను ఓ సారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 671 డివిజన్లు, 2,123 వార్డుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. వీటికి మొత్తం 17,415 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ఏకంగా 2,502 మంది మంగళవారం పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 92 ఉపసంహరణలతో రాష్ట్రంలోనే టాప్ పొజీషన్లో నిలబడడం గమనార్హం. చిత్తూరు కార్పొరేషన్లో 90, విజయవాడలో 83, తిరుపతిలో 60 మంది అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నారు.
Also Read: కోర్టు ధిక్కరణ కేసు.. ఇద్దరు కలెక్టర్లకు మూడు నెలల జైలు
అలాగే.. గుంటూరు కార్పొరేషన్లో 33, కర్నూలు కార్పొరేషన్లో 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గెలుపోటములను పక్కన పెడితే కనీసం పోటీలో నిలిచామని చెప్పుకోడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాయకుల పరువు కోసం అభ్యర్థులు బరిలో నిలుస్తారా? లేక ఉపసంహరణ దారి వెతుక్కుంటారా? అనే దానిపై సాయంత్రం నాలుగు గంటలకల్లా క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో కనీసం సగం సీట్లలో కూడా అభ్యర్థులు లేని పార్టీ తరపున చంద్రబాబు ఏమని ప్రచారం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Chandrababu ready for odarpu yatra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com