రాజకీయాలు అన్నాక ఎక్కడో ఓ చోట దొరికిపోతాం..కొన్ని విధాన నిర్ణయాల్లో తప్పులతో వచ్చే ప్రభుత్వాలు చిక్కులు పెడుతాయి. ఇప్పటి సీఎం జగన్ ను అలానే చాలా కేసుల్లో ఆయన ప్రత్యర్థులు బుక్ చేశారు. ఇప్పటికీ జగన్ వాటిని కోర్టుల్లో ఎదుర్కొంటూనే ఉన్నారు.
కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ అధినేత ఇన్నేళ్ల రాజకీయంలో ఎన్నో కేసులు పడ్డా కోర్టుకు వెళ్లి అడ్డుకుంటూ చాకచక్యంగా కేసుల బాధ నుంచి తప్పించుకున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. విచారణలు అంటేనే చంద్రబాబు కోర్టు మెట్లు ఎక్కడం.. స్టేలు తెచ్చుకోవడం ఎన్నో రోజులుగా సాగుతూనే ఉంది. చంద్రబాబు ఎందుకు విచారణను ధైర్యంగా ఎదుర్కోవడం లేదన్న ప్రశ్న ఆయన ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది.
ఇక కొందరేమో.. చంద్రబాబు అరెస్ట్ కు భయపడే ఇలా కోర్టులకు ఎక్కుతాడని.. ధైర్యంగా విచారణను ఎదుర్కొంటే ఆయనకు శిక్ష పడుతుందనే భయం బాబులో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమరావతిలో భూకుంభకోణం వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేసలా కనిపిస్తోంది.. ఏపీ సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఈరోజు చంద్రబాబుపై ఆధారాలు సీఐడీకి సమర్పించారు. సీఐడీ విచారణకు పిలవగా.. తన వద్దనున్న ఆధారాలు సమర్పించినట్టు ఆయన మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష అధినేత చంద్రబాబుపై పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భద్రతకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఇద్దరు గన్ మెన్లకు అదనంగా మరో నలుగురు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో చంద్రబాబును టార్గెట్ చేసినట్టేనని చర్చ జరుగుతోంది.
అయితే వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబును జగన్ సర్కార్ , వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వదిలేలా కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. దళితుల భూములను రాజధాని అమరావతి కోసం తీసుకొని.. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం కింద చంద్రబాబు ఇరుక్కుపోయారని.. ఆయన ఏ1 అని.. మాజీ మంత్రి నారాయణ ఏ2 అని ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు విషయంలో ఏం తేలనుందనేది ఆసక్తిగా మారింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Chandrababu did not face trial
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com