spot_img
Homeజాతీయ వార్తలుBangladesh MP: వలపు వల వేసి రమ్మని పిలిచి.. కిరాతకంగా చంపేసి.. బంగ్లా ఎంపీ హత్యోదంతంలో...

Bangladesh MP: వలపు వల వేసి రమ్మని పిలిచి.. కిరాతకంగా చంపేసి.. బంగ్లా ఎంపీ హత్యోదంతంలో సంచలన విషయాలు

Bangladesh MP: బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు అన్వరుల్ అజీమ్ అనార్ (56) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అనార్ మే 13న కోల్ కతా లో హత్యకు గురయ్యాడు. నిందితులు అతడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని తమ వెంట తీసుకెళ్లారు. ఈ కేసు ఆ దేశంలో సంచలనం సృష్టించడంతో.. పోలీసులు జిహాద్ హవలాదార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు చెప్పిన విషయాలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

జిహాద్ హవలాదర్ అన్వరుల్ కు ప్రాణ స్నేహితులు. ఈ క్రమంలో జిహాద్ హవలాదర్ బంగ్లాదేశ్ నుంచి కోల్ కతా కు అక్రమంగా వచ్చాడు. నకిలీ పత్రాలు సృష్టించి సిమ్ లు కొనుగోలు చేశాడు. ముంబైలోని చినార్ పార్క్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ ఏర్పాట్లను షాహిన్ అనే యువతి చేసింది.. అయితే ఎంపీని అంతమొందించేందుకు షాహిన్ రెండున్నర కోట్ల రూపాయలను జిహాద్ హవలాదార్ కు ముందస్తుగా చెల్లించినట్టు తెలుస్తోంది.. అయితే అన్వరుల్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం కోల్ కతా వచ్చాడు. అలా వచ్చిన అతడిని నిందితులు పకడ్బందీ ప్రణాళికతో హత్య చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన అమెరికా పౌరుడు అక్తరుజ్జమాన్.. అన్వరుల్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అక్తరుజ్జమాన్ అన్వరుల్ కు పాత స్నేహితుడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకు జిహాద్ మరో ఇద్దరు కలిసి న్యూ టౌన్ అపార్ట్మెంట్ లో ఎంపీని దారుణంగా హత్య చేశారు..

అన్వరుల్ ను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం చర్మం వలిచారు. ఎముకలు తొలగించారు. మాంసం, ఎముకలు, శరీర భాగాలను ముక్కలుగా నరికారు. వాటిని అదే ఫ్లాట్ లో ఉన్న ఫ్రిజ్ లో భద్రపరిచారు. శరీరం ముక్కలు కుళ్ళిపోయి వాసన రాకుండా ఉండేందుకు.. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం వేరువేరు ట్రాలీలలో వాటిని ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లారు. మాంసానికి మసాలాలు , పసుపు కలిపారు. అయితే వాటిని ఎక్కడ పడేశారనేది తెలియ రాలేదు. గత నెల 30న ఆన్ లైన్ ద్వారా ఒక కారు బుక్ చేసి.. అందులో ఎంపీ మృతదేహం భాగాలను తరలించారని తెలుస్తోంది. అన్వరుల్ ను చంపిన నిందితులు అదే ఫ్లాట్ లో మాంసం వండుకుని తిన్నారు. అయితే వాళ్లు తిన్నది ఎంపీ మాంసం కాదని విచారణలో తేలింది.. ఎంపీ శరీరంలో భాగాలను రెండు దశలలో యంత్రాల ద్వారా తొలగించినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు..

అయితే ఎంపీ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ” బెంగాల్ సిఐడి విభాగం న్యూటౌన్ అపార్ట్మెంట్ లోపల రక్తపు మరకలను ఐడెంటిఫై చేసింది. ఎంపీ శరీర భాగాలను తరలించేందుకు ఉపయోగించిన పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకుంది.. ఎంపీని ముందుగా గొంతు పిసికి చంపారు. ఆ తర్వాత అతడి శరీర భాగాలను తొలగించి.. ముక్కలు ముక్కలుగా చేసి.. తరలించారు. మృతదేహాన్ని గుర్తించకుండా చర్మాన్ని వలిచారు. ఎంపీని చంపేందుకు నిందితులు ఐదు కోట్లు సుఫారిగా మాట్లాడుకున్నారు. ఇందుకు గాను వారు 2.5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నారని” హోం మంత్రి వెల్లడించారు.

ఈ కేసులో షాహిన్ అనే యువతి కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈమె అఖ్తరుజ్జమాన్ స్నేహితురాలు. ఎంపీ అన్వరుల్ కు వలపు వల విసిరింది ఈమె. న్యూ టౌన్ అపార్ట్మెంట్ కు ఎంపీ ని రప్పించింది. ఆ తర్వాత ఎంపీని నిందితులు హత్య చేశారు. ఈ కేసులో సియామ్ హుస్సేన్, ముస్తాఫిజుర్ కీలకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు..కోల్ కతా పోలీసుల ఆధీనంలో ఉన్న జిహాద్ ను విచారించేందుకు బంగ్లాదేశ్ పోలీసులు కోల్ కతా వస్తారని తెలుస్తోంది.. మరోవైపు పోలీసులను జిహాద్ తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అతను చెప్పిన సమాచారం ప్రకారం వెతకాగా ఎంపీ శరీర భాగాలు లభ్యం కాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper