
అసలే ఆయన మాజీ సీఎం తనయుడు. చంద్రబాబు తర్వాత భావి టీడీపీ వారసుడు.. ఆ మాత్రం ఖదర్ ఉండకపోతే ఎట్లా అబ్బా.. అందుకే తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ బాబు ఎక్కడా తగ్గడం లేదు. ఏకంగా ఏపీ పోలీసులతోనే సై అంటే సై అంటున్నాడు. తొడగొట్టేస్తున్నాడు. గుంటూరు అర్బన్ ఎస్పీకి తమకు పట్టున్న మండలి ద్వారా తాజాగా షాకిచ్చాడు. నోటీసు పంపి నాకు వార్నింగ్ ఇస్తావా అంటూ లోకేష్ బాబు ట్విస్ట్ ఇచ్చాడు.
Also Read: సీఎంగా జగన్ అనర్హుడు పిటీషన్ పై సుప్రీం సంచలన నిర్ణయం
అసలే ఈ వివాదం ఏంటంటే.. నారా లోకేష్ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త మణిరత్నం పోస్ట్ పెడితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోలను ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైసీపీ నేతలు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతూ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు లొంగిపోవడం మానుకోవాలన్నారు.
పోలీసులపై లోకేష్ వ్యాఖ్యలకు గుంటూరు ఎస్పీ కౌంటర్ ఇచ్చాడు. హెచ్చరికలు జారీ చేశాడు. లోకేష్ ట్వీట్టర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏకంగా నారాలోకేష్ కే వార్నింగ్ ఇచ్చారు. కులపరంగా లోకేష్ రెచ్చగొట్టే విధంగా చూశారని మండిపడ్డారు.
Also Read: హైకోర్టులో మరో పిటిషన్.. ఆ మంత్రులకు ‘రంగు’ పడుద్దా?
దీనిపై సీరియస్ అయిన నారా లోకేష్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి సభా హక్కుల నోటీసు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా అమ్మిరెడ్డి తనను బెదిరించాడని నోటీసులో పేర్కొన్నాడు. టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్ట్ ను తాను తప్పుపడితే తన హక్కులకు భంగం కలిగించేలా ట్విట్టర్ లో అమ్మిరెడ్డి తనను ఉద్దేశించి పోస్టింగులు పెట్టారని సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో లోకేష్ ప్రస్తావించారు. తన హక్కులకు భంగం కలిగించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ ను కోరారు.దీంతో పోలీసులు వర్సెస్ నారా లోకేష్ ఫైట్ ముదిరింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.