క్వారంటైన్లో ఉన్నవారి కదలికల పై నిఘా కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం హౌస్ క్వారంటైన్ యాప్ పేరుతో సరికొత్త మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఒక్కరోజులోనే హౌస్ క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఐదు వేల మంది వివరాలను పోలీసులు పొందుపరచారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేస్తారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారు.
క్వారంటైన్ నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ కు ఆటో మ్యాటిక్ గా అలారం మోగడంతో సమాచారం తెలుస్తుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో తన మేధస్సును నిబద్ధతను చాటి చెబుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇది ఒక రకంగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వారికి లక్ష్మణరేఖగా భావించవచ్చంటున్నారు.