Homeఅంతర్జాతీయంAfghanistan Taliban: పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి జర్నలిస్టుతో తాలిబన్లు.. వైరల్ వీడియో

Afghanistan Taliban: పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టి జర్నలిస్టుతో తాలిబన్లు.. వైరల్ వీడియో

Anchor Gives Message of Peace on Air as 8 Armed Taliban Fighters Surround Him

Afghanistan Taliban: అప్ఘనిస్తాన్ (Afghanistan) లో ప్రజలకు క్షమాభిక్ష పెట్టామని.. మునుపటిలా తాము అరాచకం చేయమని ఓవైపు చెబుతూనే.. మరోవైపు తాలిబన్లు (Taliban) అరాచకం సృష్టిస్తున్నారు. తమ ప్రత్యర్థులను వేటాడుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించే జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, కళాకారులను ఇంటికెళ్లి మరీ కాల్చిపారేస్తున్నారు. తాజాగా ఒక జానపద గాయకుడిని చంపేశారు. దీన్ని బట్టి తాలిబన్లు చెప్పేదొకటి.. చేసేదొకటి అని తేలిపోయింది.

అప్ఘనిస్తాన్ లో స్వేచ్ఛ పాలన చేస్తామన్న తాలిబన్లు తమ అరాచక పాలనను కొనసాగిస్తున్నారు. అక్కడి టీవీల్లో రేడియోల్లో మహిళలు కనిపించకుండా నిషేధించారు. మహిళలను టీవీల్లో, రేడియోల్లో కనిపించకూడదు.. వినిపించకూడదని హుకూం జారీ చేశారు.

తాజాగా అప్ఘన్ టీవీల్లోకి తాలిబన్లు చొరబడ్డారు. నేరుగా టీవీ తెరపైకి తాలిబన్ ఫైటర్లు వచ్చి బలవంతంగా యాంకర్లతో పాయింట్ బ్లాంక్ లో తుపాకీ గురిపెట్టి మరీ తమ సందేశాన్ని వినిపించిన తీరు గగుర్పొడిచేలా ఉంది. టీవీ యాంకర్ ను చుట్టుముట్టి తమ తమ సందేశాన్ని అతడితోనే చెప్పించడం విశేషం. టీవీలుచూస్తున్న అప్ఘన్ ప్రజలు ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యారు.

అప్ఘన్ టీవీలో లో నిన్న రాజకీయ చర్చ జరుగుతోంది. దేశంలో శాంతిని నెలకొల్పే మార్గాలపై అప్ఘన్ టీవీ ఏర్పాటు చేసిన చర్చను యాంకర్ మొదలుపెట్టాడు. అంతలోనే తాలిబన్లు ఆ టీవీ చానెల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. టీవీ లైవ్ ప్రసారం అవుతున్న స్టూడియోలోకి వచ్చారు. ఆయుధాల్ని పట్టుకొని అలాగే స్టూడియోలోకి తాలిబన్లు ఫైటర్లు వచ్చి వెనుకాల నిలబడ్డారు. దీంతో యాంకర్ తీవ్ర భయాందోళనకు గురై గజగజా వణికిపోయాడు. తనను తాలిబన్లు చంపేస్తారేమోనని భయపడ్డాడు.

ఈ క్రమంలో ‘తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని చూసి అప్ఘనిస్తాన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’ అని యాంకర్ తో లైవ్ లో చెప్పించారు. అవి చెబుతున్నప్పుడు యాంకర్ భయంతో వణికిపోయాడు. వెనుకాల తుపాకీ గురిపెట్టి మరీ ఈ వ్యాఖ్యలు చెప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీవీలో ఏకంగా ఎనిమిది మంది తాలిబన్ ఫైటర్లు టీవీ యాంకర్ ను చుట్టుముట్టారు. వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలున్నాయి. యాంకర్ ను చుట్టుముట్టి మరీ తాము మారిపోయినట్టు చెప్పించారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు జర్నలిస్టును చంపేస్తారేమోనని వీక్షకులు ఆందోళన చెందారు.

తాము మారిపోయామని.. తమను చూసి భయపడవద్దని ఓవైపు తాలిబన్ పెద్దలు చెబుతున్నారు. కానీ చేతల్లో మాత్రం తమ సహజ క్రూరత్వాన్ని తాలిబన్లు చూపిస్తున్నారు. అరాచకం సృష్టిస్తున్నారు. కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్న తాలిబన్లు ఇప్పుడు మొత్తంగా తమకు వ్యతిరేకంగా ఎవరు చేసినా అణిచివేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular