Homeహెల్త్‌Solution : అన్ని రోగాలకు ఒకటే పరిష్కారం.. జస్ట్ సింపుల్

Solution : అన్ని రోగాలకు ఒకటే పరిష్కారం.. జస్ట్ సింపుల్

Solution : చాలా మంది కరివేపాకును కూరల్లో వేస్తారు. దీని వల్ల కూరలు టేస్ట్ వస్తాయి. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కాల్షియం లు ఉంటాయి. కూరలో కచ్చితంగా వేసే కరివేపాకును నేరుగా నమిలితే మరింత ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇక పరగడుపున ఓ 4 నుంచి 5 కరివేపాకులను తిని ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకీ ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో కూడా తెలుసుకోండి.

నోటి ఆరోగ్యం : నోటి ఆరోగ్యానికి కరివేపాకు చాలా పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ ఉదయం కరివేపాకులను నమిలితే దంతాల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా చనిపోతుంది. దీంతో దంతాలు కుళ్లిపోయే ప్రమాదం ఉండదు. బ్యాక్టీరియాకు చెక్‌ పెట్టడం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది.

నిరోధక శక్తి : రోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకులను తింటే నిరోధక శక్తి పెరుగుతుంది. వేడి నీటిలో కరివేపాకులను మరిగించి తాగితే కూడా మరింత ప్రయోజనం చేకూరుతుంది. తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు : బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే ప్రతీ రోజూ ఉదయం కరివేపాకులను తినాలి. ఇందులోని డైక్లోరోమీథేన్, ఇథైల్ అసిటేట్ వంటి మూలకాలు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అంటే బరువు కూడా తగ్గిస్తాయి కరివేపాకు. ఇక కరివేపాకు నీరు పరగడుపున తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.

డయాబెటిస్‌: మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ కరివేపాకు తింటే చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది హైపోగ్లైసీమిక్ లక్షణాలతో నిండి ఉంటుంది. చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది కరివేపాకు. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

కంటి ఆరోగ్యానికి: కరివేపాకు విటమిన్‌ ఏకి పెట్టింది పేరుగా చెబుతారు నిపుణులు. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి చూపు తగ్గుతున్నా, మసకబారి నట్లు అనిపిస్తున్నా కరివేపాకు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమలండి.

కాలేయ ఆరోగ్యం : లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని టానిన్, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి అంశాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జీర్ణ సమస్యలు : జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ఖాళీ కడుపుతో కరివేపాకును తినాలి. ప్రతి రోజు ఉదయాన్నే కరివేపాకు తింటే గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఒత్తిడి పరార్‌: కేవలం శారీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది కరివేపాకు. ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఒత్తిడిని చిత్తు చేస్తాయి అంటున్నారు నిపుణులు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular