Crossed Legs Sitting: చాలా మందికి కాలు మీద కాలు వేసుకొని కూర్చొనే అలవాటు ఉంటుంది. ఇంట్లో, ఆఫీస్ లో కూడా ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇలా గానీ లేదా క్రాస్ లెగ్ పొజిషన్ లో గానీ కూర్చోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట. పెల్విక్ ప్రాంతం అంటే పొత్తికడుపు, తొడల మధ్య భాగంలో ఉండే ఎముకల అమరికలో సమస్య వస్తుందట. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోతుందట. వెన్నెముక అమరిక కూడా దెబ్బతిని లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుందట. అంతేకాదు మరిన్ని సమస్యలు వస్తాయో చూడండి.
బీపీ చెకప్ చేసే సమయంలో కుర్చీలో కూర్చొని రెండు పాదాలను నేలమీదనే ఉంచాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుఅవుతుంది. కాలు మీద కాలు వేసుకొని కూర్చొంటే మాత్రం రక్తపోు తాత్కాలికంగా పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం కూర్చొనేటప్పుడు కూడా మోకాలి స్థాయి కంటే ఎక్కువ ఎత్తుకు కాలు ఉంటే రక్త పోటు పెరుగుతుందట. అందుకే కాలును చీలమండలంలోనే ఉంచాలట. ఇలా చేయడం వల్ల రక్తపోటు నార్మల్ గా ఉంటుందట.
సిరల ద్వారా రక్త ప్రవాహం సులభంగా గుండెకు చేరుకుంటే లేదంటే పంపింగ్ జరుగుతున్నప్పుడు రక్త ప్రసరణలో సమస్య వస్తే రక్తం తిరిగి సిరల్లో ప్రవహిస్తుందట. దీని వల్ల సిరల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటిలో రక్తం గడ్డ కట్టే సమస్య కూడా ఏర్పడుతుంది. శరీరంలోని ఎన్నో భాగాల మీద సిరలు ఉబ్బినట్లు కూడా కనిపిస్తాయట. అంతేకాదు ఇలా కూర్చొంటే వెరికోస్ వెయిన్స్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందట.
కాలు మీద కాలు వేసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉందట. తొడల భాగంలో బరుపు పెరగడం, కాళ్లు ఉబ్బడం వంటి సమస్యలు రావచ్చట. కొన్ని సందర్భాల్లో శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగక, నడవలేని పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉందట. ఇలా కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, మోకాలి నొప్పి, పాదాలలో తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు.