Healthy Breakfast: ఒకప్పటి మాదిరిగా శారీరక శ్రమ లేదు. కనీసం నాలుగు అడుగులు వేయకుండానే అన్ని కాళ్ల ముందుకు.. కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. క్లిక్ దూరంలోనే అన్ని ఉంటున్నాయి. జేబులో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఎటువంటి కష్టం దరిచేరకుండానే
… చెమట చుక్కలు చిందించకుండానే పనులు జరిగిపోతున్నాయి. కనీసం ఇలాంటప్పుడైనా సరే శరీరానికి మంచి చేసే పని ఒక్కటైనా చేయాలి.
శారీరక శ్రమ లేకపోతే శరీరంలో కొవ్వులు పేరుకుపోతూ ఉంటాయి. వాటి వల్ల రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. అందువల్లే హెల్దీ ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్లో పూరి తినేస్తుంటారు. అదికూడా ప్లేట్లకు ప్లేట్లు తింటూ ఉంటారు. మరికొందరేమో మైసూర్ బజ్జీలను అదేపనిగా తింటుంటారు. వడ, ఇంకా రకరకాల నూనె పదార్థాలను దర్జాగా తింటుంటారు. తింటున్నప్పుడు నోటికి రుచి తగులుతూ ఉంటుంది. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. కానీ అదే పనిగా తింటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది.
నేటి కాలంలో జీవన శైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో.. బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పోషకాహార నిపుణులు… వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ వల్ల రోజంతా ఉత్సాహం లభిస్తుంది. మనసుకు హాయి కలుగుతుంది. అంతేకాదు శరీరానికి సరికొత్త శక్తి వస్తుంది. బోండాలు, వడలు, పూరి వంటి ఆయిల్ ఫుడ్ కాకుండా.. పోషకాలు నిండి ఉన్న ఆహారం మీద దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట నానబెట్టిన మొలకలు.. గింజలు.. ఉడికించిన కోడిగుడ్లు.. గ్రీకు యోగర్ట్ వంటి వాటిని తీసుకోవాలని చెప్తున్నారు. అల్పాహారంలో వీటిని భాగంగా చేసుకుంటే శరీరానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.
కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో మైదాను ఎక్కువగా వాడుతుంటారు. చక్కెరను కూడా అదే పనిగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోతుంటాయి. అవి రకరకాల వ్యాధులకు దారితీస్తుంటాయి. అందువల్ల బ్రేక్ఫాస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా నూనె పదార్థాలకు అత్యంత దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు.. వైద్యులు సూచిస్తున్నారు.
ఈ కథనం పాఠకులకు సమగ్రమైన సమాచారం అందించేందుకు రూపొందించాం. ఈ స్టోరీ వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. దీనిని పాఠకులు గమనించాలని కోరుతున్నాం.