bone pain : ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ను తప్పకుండా తీసుకోవాలి. చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటి రేట్లు అయితే ఆకాశాన్ని తాకుతాయి. డైలీ లైఫ్లో డ్రై ఫూట్స్ను యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో నీరసం, అలసట పోయి యాక్టవ్గా మారుతారు. అయితే ఈ డ్రైఫూట్స్లో చాలా రకాలు ఉంటాయి. మనలో చాలామందికి కొన్ని మాత్రమే తెలిసి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈరోజుల్లో చాలామంది ఎముకల నొప్పితో బాధ పడుతున్నారు. పోషకాలు, కాల్షియం, మెగ్నీషియం ఉండే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల ఎముకలు తొందరగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే డైలీ కొన్ని రకాల డ్రైఫూట్స్ను డైట్లో చేర్చుకోవాలి. అప్పుడే ఎములకల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
ఎండు ద్రాక్ష
డైలీ లైఫ్లో ఎండు ద్రాక్షను యాడ్ చేయడం వల్ల శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులోని పోషకాలు కండరాలు, ఎముకలను బలంగా చేయడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని డైలీ ఏదో ఒక సమయంలో తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సాధారణ ఎండు ద్రాక్ష కంటే నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే ఇంకా బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. నీరసం, అలసట వంటివి సమస్యల నుంచి వెంటనే విముక్తి పొందవచ్చు.
బాదం
రాత్రి నానబెట్టి ఉదయాన్నే బాదం గింజలను తింటే శరీరానికి తక్షణమే బలం వస్తుంది. అలాగే ఇందులోని పోషకాలు ఎముకలకు మేలు చేయడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. అలాగే వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలివితేటలు పెరుగుతాయని కూడా అంటున్నారు. కేవలం నానబెట్టి మాత్రమే కాకుండా బాదంతో పాలు చేసుకుని కూడా తాగవచ్చు.
ఖర్జూరం
ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తాయి. ఇందులోని ప్రొటీన్లు, కాల్షియం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం రెండు నుంచి మూడు ఖర్జూరాలను తినడం వల్ల నీరసం ఉండదు. బరువు తక్కువగా ఉంటే వెంటనే పెరుగుతారు.
పిస్తా
పిస్తాలో కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలు బలహీనంగా మారకుండా చేస్తాయి. రోజూ పిస్తాను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్ వంటివి రాకుండా కూడా కాపాడుతుంది.
జీడిపప్పు
ఇందులో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడంతో పాటు కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. డైలీ వీటిని తినడం వల్ల బరువు తగ్గడం, కళ్లు ఆరోగ్యంగా ఉండటం, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని వైద్య నిపుణలు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More