Homeజాతీయ వార్తలుCancer Treatment: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంతోషంలో రొమ్ము, క్యాన్సర్ బాధితులు

Cancer Treatment: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంతోషంలో రొమ్ము, క్యాన్సర్ బాధితులు

దేశంలో అవసరమైన ఔషధాల ధరలను నియంత్రించే పనిని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) చేస్తుంది.

Cancer Treatment : దేశంలోని ప్రజలకు నిత్యావసర ఔషధాలు చౌక ధరలకే అందేలా చూడాలి. దీని కోసం ప్రభుత్వం మందుల ధరలను నియంత్రిస్తుంది. ఇప్పుడు దీపావళికి ముందు క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. దీని వల్ల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్‌పి(ధర) తగ్గనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దేశంలో అవసరమైన ఔషధాల ధరలను నియంత్రించే పనిని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ట్రస్టుజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మూడు ఔషధాల MRP (గరిష్ట చిల్లర ధర) తగ్గించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఆదేశించింది. వీటిలో, ట్రాస్టూజుమాబ్‌ను రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు, అయితే ఒసిమెర్టినిబ్‌ను ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో, దుర్వాలుమాబ్‌ను రెండు రకాల క్యాన్సర్‌ల చికిత్సలో ఉపయోగిస్తారు.

సరసమైన ధరలకు అందించాలి
ఈ క్యాన్సర్ మందుల ధరలను తగ్గిస్తూనే.. సామాన్యులకు తక్కువ ధరలకే నిత్యావసర మందులు అందేలా చూడాలన్నదే తమ సంకల్పమని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల ఔషధాల గరిష్ట ధరను తగ్గించాలని ఎన్‌పిపిఎ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల, ఈ మందులపై జీఎస్టీ రేటు తగ్గించబడింది. అయితే ఈ మందులపై కస్టమ్ డ్యూటీ కూడా కేంద్ర బడ్జెట్ 2024-25లో రద్దు చేయబడింది. అందువల్ల పన్ను తగ్గింపు ప్రభావం మందుల ధరలపై కూడా కనిపించాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఇప్పుడు వాటి ఎంఆర్పీని తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం ఇప్పటికే ఈ మందులపై కస్టమ్ డ్యూటీని రద్దు చేసింది.

కొత్త ధరలు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి
ప్రభుత్వం ఇటీవల ఈ మందులపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అందువల్ల, కంపెనీలు దాని ఎమ్మార్పీని అక్టోబర్ 10, 2024 నుండి తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే దాని కొత్త ఎమ్మార్పీ ఆ రోజు నుండి అమలులోకి వస్తుంది. ఉత్పత్తిదారులకు కూడా ఎమ్మార్పీని తగ్గించాలని, ధరల మార్పు గురించి డీలర్లు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు, ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, భారతదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 14 లక్షలకు పైగా పెరిగింది. ఏటా పెరిగే ట్రెండ్‌ ఉంది. ఇది 2020 సంవత్సరంలో 13.9 లక్షలుగా ఉంది, ఇది 2021లో 14.2 లక్షలకు పెరిగింది, 2022లో వారి సంఖ్య 14.6 లక్షలకు చేరుకుంది.

Related News

Most Popular

Oktelugu Epaper