చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు నిఖిల్. తన సినిమాలకంటూ టాలీవుడ్ ప్రేక్షకుల్లో స్పేషల్ మార్క్ను క్రియేట్ చేసుకుని విభిన్న కథాంశాలతో దూసుకెళ్లిపోతున్నారు. స్వామి రారా తర్వాత నుంచి నిఖిల్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ వస్తున్నారు. ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా ప్రతి సారీ సరికొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, మరో అప్డేట్ ఇస్తూ.. అభిమానుల్లో ఒక్కసారిగా జోష్ పెంచారు నిఖిల్. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు చిత్రాలకు పని చేస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు నిఖిల్.
తన కెరీర్లో ఎప్పుడూ చూడని అనుభవంగా వర్ణించారు. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేయడంతో తన నలుగురు పిల్లల్లో ఎవర్ని మొదటగా ఎంచుకోవాలో అన్నట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. అన్ని సినిమాలకు తన బెస్ట్ ఫర్మార్మెన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్కు సినిమాలపై ఉన్న డెడికేషన్ ఎంటో అర్థం చేసుకోవచ్చు.
స్వామిరారా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నిఖిల్.. ఆ తర్వాత వచ్చిన కార్తికేయ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు నిఖిల్. చేసే ప్రతి సినిమాలో విభిన్న కథను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. చివరగా నిఖిల్ నుంచి వచ్చిన సినిమా అర్జున్ సురవరం. ఇందులో జర్నలిస్టుగా అదరగొట్టారు. మరి వచ్చే నాలుగు చిత్రాల్లో నిఖిల్ ఎలా కనిపించనున్నాడో చూడాలి.