Homeఎంటర్టైన్మెంట్Nikhil Shooting Accident: షూటింగ్ సెట్ లో జరిగిన ఘోరప్రమాదం పై స్పందించిన హీరో నిఖిల్..ట్వీట్...

షూటింగ్ సెట్ లో జరిగిన ఘోరప్రమాదం పై స్పందించిన హీరో నిఖిల్..ట్వీట్ వైరల్!

Nikhil Shooting Accident: నిన్న హీరో నిఖిల్(Nikhil Siddharth) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియా హౌస్'(The India House) షూటింగ్ సెట్స్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్(Global Star Ram Charan) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రమిది. సముద్రపు సన్నివేశాలను చిత్రీకరించడం కోసం కొన్ని భారీ వాటర్ ట్యాంకర్స్ ని లొకేషన్స్ కి తీసుకొచ్చారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ వాటర్ ట్యాంకర్స్ బ్లాస్ట్ అయ్యాయి. దీంతో సముద్ర ప్రవాహం ని తలపించేలా సెట్స్ మొత్తం అత్యంత వాయు వేగంతో నీళ్లు దూసుకొచ్చాయి. ఈ ప్రమాదం లో అసిస్టెంట్ కెమెరా మ్యాన్ కి తీవ్రమైన గాయాలు అయ్యాయని, మరికొంత మంది మూవీ స్టాఫ్ కి కూడా గాయాలు అవ్వడంతో హాస్పిటల్ కి తరలించారని నిన్న ఒక వార్త వచ్చింది. దీనిపై హీరో నిఖిల్ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో రెస్పాన్స్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం మేమంతా క్షేమంగానే ఉన్నాము. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతి కలిగించాలని మేము కొన్ని రిస్కులను అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటాము. ఆ రిస్క్ ఈరోజు కాస్త మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ముందస్తుగా అలెర్ట్ రావడంతో మేమంతా ఈ భారీ ప్రమాదం నుండి తప్పించుకున్నాము. చాలా ఆస్తి నష్టం జరిగింది. కానీ దేవుడి దయవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’ అంటూ నిఖిల్ సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రామవంశీ అనే నూతన దర్శకుడితో మన దేశానికీ స్వాతంత్రం రాకముందు జరిగిన ఒక యాదార్థ ఘటనని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన స్నేహితుడు వికాస్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించి దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది.

ఈమధ్య కాలంలో ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్ ఒక్కటి కూడా బయటకు రాకపోవడం తో అసలు ఈ సినిమా ఉందా?, లేకపోతే ఆగిపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ సైలెంట్ 50 శాతానికి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. అనుపమ్ ఖేర్ ఈ చిత్రం లో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ, అది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. ‘కార్తికేయ 2’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్ చేసిన 18 పేజెస్, స్పై చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు నిఖిల్ కి ఒక భారీ హిట్ అత్యవసరం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular