Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: బయటపడిన ప్రియమణి నిజస్వరూపం.. ఇంటి నుంచి గెంటేసిన వంటలక్క..!

Karthika Deepam: బయటపడిన ప్రియమణి నిజస్వరూపం.. ఇంటి నుంచి గెంటేసిన వంటలక్క..!

బుల్లితెరపై రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత ఇంటికి వెళ్లిన ప్రియమణితో మోనిత మాట్లాడుతూ త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయి కార్తీక్ కుటుంబం నన్ను వారి ఇంటికి ఆహ్వానించే సమయం దగ్గర పడింది. మనం ఇక్కడ ఎలా రిమోట్ నొక్కితే అక్కడ అలా జరుగుతుంది అంటూ సంతోష పడతారు.నేను కార్తిక్ ఇంటికి వెళ్ళే సమయానికి చాలా అందంగా తయారు కావాలి అందుకు కావలసిన సామాన్లు లిస్టు చెప్పి ప్రియమణిని తీసుకు రమ్మంటుంది.

అంతలోనే కాలింగ్ బెల్ మోగడం భారతి లోపలికి వచ్చి సౌందర్య తనకు ఫోన్లో చెప్పిన విషయాలు చెప్పడంతో విని విననట్టుగా ప్రియమణి భారతికి ఒక టీ తీసుకురా అంటుంది. భారతీ ఎన్నిసార్లు చెప్పినా మోనిత అలాగే ప్రవర్తించడంతో భారతి కోపం తెచ్చుకుంటుంది. అప్పుడు మోనిత మాట్లాడుతూ ఈ విషయాలు నీతో చెప్పకపోతే నేరుగా నాతోనే మాట్లాడొచ్చు కదా అంత పొగరు ఆ అందమైన అత్తకు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎన్ని మాటలు అని ఉంది అంటూ మాట్లాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు భారతి ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు అంటూ తనని పంపిస్తుంది.

ఇక సౌందర్య కార్తీక్ ని తీసుకువచ్చి రేపు ఎలాగైనా శాంతి పూజకు రావాలని చెబుతుంది. మమ్మీ నీ సంతోషం కోసం శాంతి పూజ చేస్తాను కానీ ఆ మోనిత పక్కన కూర్చొనని చెప్పడంతో సౌందర్య కార్తీక్ ను మరింత బలవంతం చేస్తుంది.ఆ సమయంలో కార్తీక్ పూజ గది దగ్గరకు వెళ్లి ఆ దేవుడు పై ప్రమాణం చేస్తున్నాను నేను స్పృహలో ఉండి ఈ తప్పు చేయలేదు మమ్మీ అంటూ మాట్లాడుతుండగా అంతలో దీప వచ్చి అత్తయ్య శాంతి పూజ మనశ్శాంతి అంటున్నారు అనగా షాక్ అయిన సౌందర్య రేపు మంచి రోజు దేవుడి గది శుభ్రం చేస్తే మనశ్శాంతిగా ఉంటుందని మాట్లాడుతున్నాను అంటుంది. అప్పుడు దీప రేపు పూజగది శుభ్రం చేయడానికైనా నన్ని పిలుస్తారా లేక మీరిద్దరే చేస్తారా అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్తుంది.

ఇక ప్రియమణి మోనిత ఇంటి నుంచి వెనుక వైపు వస్తూ తనని ఎవరు చూడలేదని తలుపులు తియ్యగా దీప కనపడటంతో షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళావ్ అంటూ దీపా ప్రియమణిని నిలదీస్తుంది. ఎవరూ లేరని కష్టాల్లో ఉన్నానని బ్రతిమాలి తేనే కదా ఇక్కడ పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్లావు చెప్పు అంటూ తన ఉగ్రరూపం చూపించగా ఎలాగో అవకాశం వచ్చింది తనకు నిజం చెప్పి మోనితమ్మ దగ్గరకు వెళ్లి పోవడం మంచిదని భావించిన ప్రియమణి మోనిత దగ్గరకు వెళ్లాను అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. ఇప్పుడే కాదు మోనిత జైల్లో ఉన్నప్పుడు కూడా తనని కలిసేదాన్ని అని ప్రియమణి అసలు విషయం బయటపెట్టడంతో దీప షాక్ అవుతూ ఈ కుటుంబ విషయాలు అక్కడికి చేర్చి నమ్మక ద్రోహం చేస్తావా అంటూ తనని బయటకు నెట్టేస్తుంది.

ఇక సౌందర్యకు ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన సౌందర్య షాక్ అవుతుంది తనకు భారతి ఫోన్ చేసి మోనిత చెప్పిన మాటలను చెప్పినట్టు ఉంది. ఇక పిల్లలిద్దరూ కార్తీక్ దీపతో కలిసి పడుకోవాలని ప్లాన్ వేస్తారు.అందుకు కార్తిక్ వద్దులే అంటుండగా హిమ మాత్రం ఎందుకు డాడీ నువ్వు అమ్మ మాట్లాడుకోవడం లేదు అంటూ ఎమోషనల్ గా అడగడంతో కార్తీక్ బాధతో హక్కును చేర్చుకుంటాడు. తరువాత ఎపిసోడ్లో కార్తీక్ పూజకు వెళతాడా… ఏం జరగనుంది తెలియాల్సి ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular