కరోనా దాటికి ఇద్దరు నూతన హీరోల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ఎన్నో ఆశలతో ,ఎంతో నమ్మకం తో తమ తొలి చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువ నటులకు ఆశాభంగం ఎదురయ్యింది. హీరోగా అరంగేట్రం చేసిన తొలి సినిమాని తెరపైన చూడాలి, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలని అనుకొన్న వారి కల అంతకంతకు దూరం అవుతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యాంకర్ ప్రదీప్ ల ప్రస్తుత పరిస్థితి అదే.
మెగా మేనల్లుడు సాయి (ధరమ్ ) తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ తొలి సారిగా ” ఉప్పెన ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. నూతన దర్శకుడు సాన బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం లోని పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. దానికి తోడు తమిళ రీమేక్ రైట్స్ కూడా అమ్మడం జరిగింది. ఇక విడుదల అయితే విజయం తధ్యం అనుకుంటున్న వేళ కరోనా లాక్ డౌన్ అడ్డంకి గా మారింది. సినిమా విడుదల ఆగిపోయింది .
ఇక బుల్లి తెర యాంకర్ గా పాపులర్ అయ్యి , ఇపుడు హీరోగా మారిన ప్రదీప్, తొలిసారిగా నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. కాగా ఈ మూవీపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం లో సిద్ శ్రీరామ్ పాడిన ` నీలి నీలి ఆకాశం ` సాంగ్ శ్రోతల్ని బాగా ఆకట్టుకొని బంపర్ హిట్ అయ్యింది. ఆ క్రమం లో సినిమా హిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఏర్పడింది అలా ఈ ఇద్దరు హీరోల తొలి చిత్రాలు విడుదలకు ముందే ఆగి పోయి వారిని టెన్షన్ పెడుతున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Vaishnav tej and pradeep machiraju affected by coronavirus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com