Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఏకంగా ఆమె ఐదు వరుస ప్లాప్స్ ఇచ్చారు. ఎఫ్ 3 కూడా పరిగణలోకి తీసుకుంటే ఆరు ప్లాప్స్. రెండు హ్యాట్రిక్స్ ఆమె పూర్తి చేశారు. ఒకప్పుడు లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో వరుస హిట్స్ ఇచ్చిన పూజా హెగ్డే ఐరన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ మేకర్స్ ఆమెను దేకడం లేదు. అక్కినేని అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం తర్వాత ఆమెకు హిట్ లేదు. రాధే శ్యామ్ తో మొదలైన తిరోగమనం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరకు కొనసాగింది.
ఈ క్రమంలో పూజా హెగ్డే తీవ్ర మానసిక వేదనకు గురయ్యారట. ఆమె గంటల తరబడి ఒంటరిగా గదిలో గడుపుతున్నారట. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు వైద్యుడిని సంప్రదించారట. మందులు వాడుతోందట. ఈ డిప్రెషన్ లో చేయకూడని పనులు చేస్తుందట. గుంటూరు కారం సెట్స్ లో మహేష్ బాబును రెచ్చగొట్టిందట. ఆయన పట్ల తన కోరిక బయటపెట్టిందట… అంటూ ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్ చేశాడు.
ఉమర్ సంధు ట్వీట్ సంచలనం రేపుతోంది. పూజా వ్యక్తిత్వం, ఆరోగ్యంపై ఉమర్ సంధు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను ఓ పిచ్చిదానిగా వర్ణించాడు. ఉమర్ సంధు తీరుపై పూజా హెగ్డే అభిమానులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం పుకార్లు లేపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పూజా హెగ్డేను ఉమర్ సంధు టార్గెట్ చేశాడు. హీరో సల్మాన్ ఖాన్ తో పూజా అఫైర్ పెట్టుకుందని ట్వీట్ చేశాడు.
అందుకే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ లో పూజా హెగ్డేకు రెండు చిత్రాల్లో ఆఫర్స్ ఇచ్చాడంటూ ఉమర్ సంధు ఆరోపించాడు. ఉమర్ సంధు ఆరోపణలను సల్మాన్ ఖాన్ టీమ్ ఖండించారు. ఈ మధ్య ప్రతి ప్రముఖ హీరో, హీరోయిన్స్, దర్శకులను వదలకుండా అతడు టార్గెట్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ కూడా ఎఫైర్స్ కలిగి ఉన్నారంటూ ట్వీట్ చేశాడు.
#PoojaHegde gone Mad after Back to Back 5 Disasters. She locked herself for hours in room. She is taking anti anxiety & depression medicines. She is also taking drugs for keep herself calm. She even sexually harassed & seduced #MaheshBabu during shoot of #GunturuKaaram. pic.twitter.com/7JRa7jZmOi
— Umair Sandhu (@UmairSandu) June 12, 2023