Photo Story: ఇద్దరు టాప్ హీరోల మధ్యలో నవ్వులు చిందిస్తున్న పాప ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 90ల నాటి ఈ ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షిస్తుంది. నందమూరి బాలయ్య ఒక ప్రక్క, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రక్క ఉన్నారు. గౌను ధరించి, రెండు జెడలు వేసుకుని ఆ పాప ఉంది. చిరు, బాలయ్యలతో ఫోటోకి ఫోజిచ్చే అవకాశం వచ్చిందంటే ఆ పాప ఖచ్చితంగా స్టార్ కిడ్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ పాప చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. నిర్మాతగా సూపర్ హిట్ చిత్రాలు నిర్మించింది.
ఈ పాప ఎవరో కాదు ప్రియాంక దత్. సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయి పేరు ప్రియాంక దత్, చిన్నమ్మాయి పేరు స్వప్న దత్. ఇద్దరూ నిర్మాతలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నాటి నుండి అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. పలు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కాయి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియాంక దత్, స్వప్న దత్ చిత్ర నిర్మాణం చేపట్టారు.
ప్రియాంక దత్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించింది. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. అలాగే జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ కొట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎక్కువ లాభాలు పంచింది.
అలా సక్సెస్ఫుల్ నిర్మాతగా ముందుకు వెళుతుంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ని ప్రియాంక దత్ ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో కల్కి 2829 AD చిత్రం చేస్తున్నాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్స్ నటిస్తున్న కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది.
Web Title: This baby star kid between balayya and chiranjeevi do you know someone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com