Homeఎంటర్టైన్మెంట్NTR- Prasanth Neel: 'ప్రశాంత్‌ నీల్‌ - ఎన్టీఆర్' ‌సినిమా కథ...

NTR- Prasanth Neel: ‘ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్’ ‌సినిమా కథ ఇదే.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక సంచలన అంచనాలే !

NTR- Prasanth Neel: ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్ ‌ కలయికలో ఓ మూవీ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న సినిమా షూటింగ్ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం సలార్‌ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్‌ నీల్‌. అయినప్పటికి ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. అందుకే, తాజాగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఎప్పుడో తెలుసా ?. 2023, ఏప్రిల్‌ లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ప్రశాంత్‌ చెప్పాడు.

NTR- Prasanth Neel
NTR- Prasanth Neel

ఈ ఏడాది వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 చిత్రాలు ఇండియన్‌ సినిమా హిస్టరీలో నిలిచిపోయే సినిమాలు. ఈ చిత్రాలను అందించిన హీరో, డైరెక్టర్‌ కలిసి ఇప్పుడు సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కథ గురించి ఒక అప్ డేట్ ఏమిటంటే.. ‘గతంలో పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందట.

అయితే విచిత్రంగా ఎన్టీఆర్ ఒక పాకిస్థానీగా నటించబోతున్నాడని తెలుస్తోంది. తన పూర్వికులు హిందువులు కావడం, తనకు ఇండియా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండటం కారణంగా ఇండియా గెలుపు కోసం ఎన్టీఆర్ పాత్ర ఎలాంటి త్యాగం చేశాడనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. పైగా ఆ యుద్ధం నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో నిర్మించనున్నారు.

ఈ సినిమా ఇండియాకే గర్వకారణంగా ఉంటుందట. పైగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ వచ్చే ఏడాది దాదాపు 180 రోజుల పాటు బల్క్ డేట్స్ కేటాయించబోతున్నాడు. 2023లో సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లినా.. అదే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ షార్ప్ టేకింగ్ కి, టైట్ స్క్రీన్ ప్లేకి మధ్య జరిగిన సంఘర్షణ మయంగా మలచాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడట. సహజంగా ప్రతి సీన్ ను ఎమోషన్బ్ తో డ్రైవ్ చేయడం, పైగా ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం ప్రశాంత్ నీల్ స్టైల్.

NTR- Prasanth Neel
NTR- Prasanth Neel

ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని కూడా ప్రశాంత్ తన శైలిలోనే చేయబోతున్నాడు. మొత్తానికి ‘కేజీఎఫ్’ అనే ఒక్క సినిమాతోనే నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఫుల్ డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే, పాన్ ఇండియా రేంజ్ నిర్మాతలు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి భారీ అడ్వాన్స్ లు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, ప్రశాంత్ నీల్ కి ఆల్ రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా నిర్మాణంలో దానయ్య కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular