టాలీవుడ్లో బతకనేర్చిన నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. సినిమాను వ్యాపారం కోణంలోనే నిర్మిస్తూ డబ్బులు రాబట్టడంలో సురేష్ బాబుది అందెవేసిన చేయి అని అందరికీ తెల్సిందే. పైసల విషయంలో ఎంతో పొదుపు పాటిస్తుంటారు. ప్రతీ పైసా లెక్కేసుకుంటారు. భారీ బడ్జెట్లో కాకుండా మిడియం బడ్జెట్లో సినిమాలు తీస్తూ భారీ విజయం సాధించే నిర్మాతల్లో సురేష్ బాబు ముందు వరుసలో నిలుస్తుంటారు.
Also Read : అందుకే రోజా, ప్రియమణిలకు శేఖర్ మాస్టర్ దూరం !
ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వరుసగా సినిమాలు వచ్చేవి. టాలీవుడ్లో ఈ బ్యానర్ కు మంచి పేరుంది. అయితే ఇటీవలీ కాలంలో ఈ బ్యానర్ నుంచి చెప్పుకోదగిన సినిమాలు రావడం లేదు. అడపదడపా మినహాయించి వరుసగా సినిమాలు వచ్చిన పరిస్థితుల్లేవు. ఇక కొంతకాలంగా సురేష్ బాబు సినీ నిర్మాణం కంటే ఇతర విషయాలపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.
సురేష్ బాబు ఇటీవల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు ఫ్యామిలీకి ఎలాగూ స్టూడియో ఉండటంతో కావాల్సినంత ఎక్విప్మెంట్ కూడా ఉంది. దీంతో పెద్దగా ఖర్చులేకుండా ఫ్యాకల్టీ నియమించుకొని ఇన్టిట్యూట్ ప్రారంభించారు. సినిమాలతోపాటు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో తన పూర్తి ఫోకసంతా ఆ కళాశాలపై పెట్టి ప్రచారంలోకి తీసుకెళుతున్నాడు.
తాజాగా తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో పాసై బయటికి వెళ్లిన ఇద్దరితో రెండు సినిమాలను తీయనున్నట్లు సురేష్ బాబు చెప్పారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇందులో ఒకటి థ్రిల్లర్ కథాంశంతో వస్తుండగా మరొకటి సెమి బయోపిక్ తో రాబోతుందట. అయితే ఈ రెండు సినిమాలకు సురేష్ బాబే నిర్మాత వ్యవహరిస్తారా? లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.