Hero Siddarth: తెలుగు సినీ పరిశ్రమలో సొంతంగా నిలదొక్కుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. బాయ్స్ సినిమాలో హీరోగా పరిచయమై ఆ తర్వాత వరుసగా విభన్న కథాంశాలతో పలకరించి.. ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తూ.. రెండు ప్రాంతాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. మధ్యలో ఫామ్ కోల్పోయినా.. మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు సినీ పరిశ్రతో పాటు దేశంలో జరిగే వివిధ సంఘటనలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ.. నిరంతరం హాట్టాపిక్గా ఉంటారు. ఈ క్రమంలో తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా అసలు పట్టించుకోకుండా.. తన దారి తాను చూసుకుంటారు.
Innocent civilians murdered in cold blood by the armed forces in #Nagaland…another custodial death by #police in #TamilNadu this time a student.
Where is the accountability? Why is so much apathy seen in our supposed protectors?
— Siddharth (@Actor_Siddharth) December 6, 2021
ఇటీవలే సినిమా టికెట్ ధరలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు సిద్ధార్థ్. తాజాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. ఇటీవలే నాగలాండ్లో జరిగిన ఘటనపై సిద్ధార్థ్ మండిప్డారు. నాగాలాండ్లోని మయన్మార్ సరిహద్దు మోన్ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సామన్య పౌరులను ఉగ్రవాదులనుకొని ఈ కాల్పులు జరపడం ప్రస్తుతం దేశమంతటా కలకలం సృష్టించింది. దీంతో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రతిదాడిగా అక్కడి స్థానికులు బలగాలపై మూకుమ్మడి దాడి చేశారు.
ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్.. భద్రతా బలగారు జరిపిన కాల్పుల్లో అమాయకులు బలయ్యారని అన్నారు. తమిళనాడులోనూ ఇంకో కస్టోడియల్ డెత్ జరిగిందని కోప్పడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టూడెంట్ను కూడా బలితీసుకున్నారని మండిపడ్డారు. అసలు జవాబూదారీతనం ఎక్కడుందని ప్రశ్నించారు. కాపాడాల్సిన వారే శిక్షిస్తుంటే ఇంకెలా బ్రతకడం అంటూ విరుచుకుపడ్డారు.