Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే పది వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక మిగిలి ఉంది ఐదు వారాలు మాత్రమే కావడంతో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. కాగా హౌస్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ ని ఎవరు స్థానం ఏంటో మీరే తేల్చుకుని మీరు ఏ స్థానం లో అయితే ఉండాలని అనుకుంటున్నారో ఆ స్థానంలో నిలబడాలని బిగ్ బాస్ చెప్పారు. దీంతో టాప్ 5 నంబర్స్ కోసం కంటెస్టెంట్స్ తన్నుకున్నారు.
అయితే తాజా ప్రోమోలో కంటెస్టెంట్స్ కి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా శివాజీ .. పల్లవి ప్రశాంత్ కి నెంబర్ 1 పోసిషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ‘ నాకు లైఫ్ లో ఎవరూ త్యాగం చెయ్యలేదు.. కానీ అన్న చేశాడు. సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్ .. ఓ రైతు బిడ్డ అంటూ గర్వంగా చెప్పుకున్నాడు.
దీంతో రతిక .. ‘ ఫస్ట్ నాలుగు వారాలు నువ్వు అసలు గేమ్ ఆడిందే లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపించడం లేదు. నువ్వసలు ఒంటరిగా గేమ్ ఆడుతున్నావో.. గ్రూప్ తో కలిసి గేమ్ ఆడుతున్నావో కనిపించడం లే .. అంటూ రతిక అడిగింది. ‘ అక్క ఇటు చూడు, మా అమ్మను తిట్టినవ్ .. మా బాపుని తిట్టినవ్.. గడ్డం గీకేస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఫైర్ అయ్యాడు. తర్వాత అశ్విని -యావర్ మధ్య గొడవ జరిగింది.
అయితే మొదటి ఐదు స్థానాల్లో ఉన్న శివాజీ ,యావర్, ప్రశాంత్,ప్రియాంక, శోభా లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాప్ 5 లో ఉన్నవారు కాకుండా .. బాటమ్ ఫైవ్ లో ఉన్న అమర్, గౌతమ్ ,అర్జున్,అశ్విని, రతిక లకు గేమ్ ఆడే అవకాశం కల్పించారు. దీంతో టాప్ 5 లో ఉన్న శివాజీ,యావర్, ప్రశాంత్,ప్రియాంక,శోభాలు నోరు వెళ్ళబెట్టారు.
🔄 Brace yourselves for a Bigg Boss twist! Contestants face an unexpected 'ulta pulta' rule in the House. Watch the suspense unfold as they navigate this unexpected challenge! 🤯🔑#BiggBossTelugu7 @iamnagarjuna #StarMaa @DisneyPlusHSTel https://t.co/rjIKEzOWT0
— Starmaa (@StarMaa) November 15, 2023