కన్నడలో ‘కిరాక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. 2016లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తెరపై హీరో రక్షిత్ శెట్టితో రష్మిక రొమాన్స్ ఫ్యాన్స్ను ఫిదా చేసింది. ఆ సినిమా చేసే సమయంలోనే ఆ రక్షిత్ తో ఆమె ప్రేమలో పడింది. దాంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఆ మూవీకి రక్షితే రైటర్, ప్రొడ్యూసర్. అప్పటికే కన్నడలో అతనికి మంచి గుర్తింపు ఉంది. రక్షిత్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన మందన్నా.. అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఏమైందో ఏమో కాని పెళ్లికి ముందు వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత రష్మిక వరుస సినిమాలతో బిజీగా మారగా.. రక్షిత్ మాత్రం కొంతకాలం మూవీలకు దూరంగా ఉన్నాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకే రక్షిత్తో రష్మిక ప్రేమలో పడిందని.. బ్రేక్ రాగానే అతనికి హ్యాండ్ ఇచ్చిందన్న విమర్శలు వచ్చాయి. ఇవేవీ పట్టించుకోని రష్మిక కెరీర్ పై దృష్టి పెట్టింది.
కన్నడతో పాటు తెలుగులో కూడా అడుగు పెట్టింది. నాగశౌర్య హీరోగా 2018లో వచ్చిన ‘ఛలో’లో టాలీవుడ్కు పరిచమైంది. ఆపై విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసింది. దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మతో స్టార్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తున్న ఆమె డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కన్నడలోనూ ఆమెకు క్రేజ్ తగ్గలేదు. మరోవైపు ‘కిరాక్ పార్టీ’ సినిమాకు సీక్వెల్ తీసేందుకు రక్షిత్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో వేరే హీరోయిన్ ను తీసుకోవాలని అతను అనుకున్నాడు. అయితే, మార్కెట్ దృష్ట్యా రష్మిక అయితే మరింత క్రేజ్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, రక్షిత్తో బ్రేకప్ అయింది కాబట్టి మళ్లీ అతనితో నటించేందుకు ఆమె ఒప్పుకుంటుందో లేదో అని సంశయిస్తున్నారు. కానీ, ఈ విషయం రష్మికకు తెలియగా.. తన మాజీ ప్రియుడితో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందని సమాచారం. ఈ విషయంలో ఆమె చాలా ప్రొఫెషనల్గా వ్యవహరిస్తోందట. కానీ, రక్షిత్ మాత్రం మాజీ ప్రేయసితో చేయాలా? వద్దా? అని మీమాంసలో పడ్డాడట. ఎలాగైనా అతడిని ఒప్పించాలని చూస్తున్నారట. అతను ఓకే అంటే మూవీ పట్టాలెక్కనుంది.