Radhe Shyam: బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్. సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఒక్క సినిమా నుంచి కూడా మంచి అప్డేట్ ఇవ్వలేదని అభిమానులు బాధపడుతున్నారు. తమ హీరోను మల్లీ వెండి తెరపై చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, రాధే శ్యామ్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. సాహో సినిమా తర్వాత రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రానున్న చిత్రం రాధేశ్యామ్ నుంచి సరైన అప్డేట్స్ ఇవ్వడం లేదని ఇటీవలే ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్మాణ సంస్థ, మేకర్స్పై కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాన్ యూవీ క్రియేషన్స్ అంటూ హ్యాష్ టాగ్ చేస్తూ.. ట్రెండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

కాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్స్తో ఆడుకోవద్దంటూ.. చిత్ర నిర్మాతలకు షాక్ ఇచ్చే లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో తాజాగా రాధేశ్యామ్ ట్విట్టర్లో ట్రెండింలో నిలిస్తోంది. నవంబరు 15న రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ వస్తుందని ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలంటూ నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఫస్ట్ సాంగ్ లోడింగ్ అంటూ ఓ పోస్టర్ మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది.
కాగా, ప్రస్తుతం ఆదిపురుష్లో ప్రభాస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు సలార్ సినిమాతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్.